ISRO : 2040 నాటికి జాబిల్లి పైకి భారతీయుడు.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు
2040 నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత వ్యోమగామిని దింపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అయితే వీళ్లందరూ కూడా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లని పేర్కొన్నారు.