ఘనంగా శివరాత్రి వేడుకలు | Maha Shivaratri Celebrations 2025 In Beeramguda Temple | Ameenpur | RTV
శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో చిరుత మృతి కలకలం రేపింది. రుద్రపార్కు సమీపంలో గోడపై చిరుతపులి చనిపోయి ఉండటాన్ని అటుగా వెళ్తున్న శివభక్తులు గుర్తించారు. పులి గోర్లు కట్ చేసి ఉండటం పలు అనుమానాలకు తావుతీస్తోంది.
45రోజుల కుంభమేళా శివరాత్రి ఆఖరిరోజు కావడంతో త్రివేణి సంగమానికి భారీగా భక్తులు చేరుకున్నారు. శివరాత్రి కాబట్టి బుధవారం కుంభమేళా కిక్కిరిసిపోయింది. అమృత స్నానాలు చేసిన భక్తులపై పూల చల్లారు. ఈ రోజు ప్రయాగ్రాజ్లో సూపర్ విజువల్స్ ఆర్టికల్లో చూడండి.
ఈ ఏడాది వచ్చే మహా శివరాత్రి చాలా అరుదైనది. సూర్యుడు, బుధుడు, శని గ్రహాలు శివరాత్రి రోజున కుంభ రాశిలో ఉంటాయి. 149 ఏళ్ల తర్వాత మూడు పవర్ఫుల్ గ్రహాల ఈ కలయిక చాలా మంచిది. ఇలాంటి కలయిక రోజున శివుడిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
పోలీసులు కోటప్పకొండ శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం నిఘా పెట్టిన డ్రోన్ కూప్పకూలిపోయింది. బుధవారం ఉదయాన్నే సాంకేతిక సమస్యతో డ్రోన్ క్యాంటీన్ పైనున్న విద్యుత్ తీగలపై పడింది. డ్రోన్ పడటంతో వైర్లుతెగి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి.
మహాశివరాత్రి సందర్భంగా భక్తులు శ్రీశైలానికి తరలి వెళ్తున్నారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మంగళవారం నుంచే లక్షలసంఖ్యలో శ్రీగిరికి బయల్దేరారు. ఇక ఇవాళ వేకువ జాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి.