🔴Live News Updates: పోసాని కృష్ణ మురళి భార్యకు YS జగన్ ఫోన్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం ఓటీటీలో కొత్త రికార్డ్ సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో 13 వారల పాటు ట్రెండింగ్ లో ఉన్న తొలి సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ధోనీ చెన్నై టీమ్ను గెలిపించినట్లు తాను వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీని గెలిపిస్తానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. విజయ్ పార్టీని గెలిపిస్తే తమిళనాడులో ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని చెప్పుకొచ్చారు.
సిగ్నేచర్ షాట్ కవర్డ్రైవ్ కోహ్లీకి బలహీనంగా మారిందని పలువురు మాజీలు ఎన్నోసార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. అది నిజమే అంటూ కోహ్లీ అంగీకరించాడు. ఇది నాకు సంకటస్థితి. కొన్నేళ్ల నుంచి కవర్ డ్రైవ్ నా బలహీనతగా మారిందంటూ విరాట్ అన్నాడు.
యాదగిరిగుట్ట దేవస్థాన గోపురం రికార్డుకెక్కింది. దేశంలో ఎత్తైన స్వర్ణ గోపురంగా యాదగిరిగుట్ట ఆలయ గోపురం నిలవటం విశేషం.స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి హాజరుకావాలని సీఎం రేవంత్ , మాజీ సీఎం కేసీఆర్ను ఆలయ అర్చకులు ఇప్పటికే ఆహ్వానించారు.
బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఒక మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇంకా ఒకరు పరారీలో ఉన్నారు. బాధిత మహిళ క్యాటరింగ్ సర్వీసెస్లో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తిరుపతి వెస్ట్ పీఎస్ పరిధిలో జగనన్న సైన్యం పేరుతో ఫొటో అసభ్య మార్ఫింగ్పై కేసు నమోదు కాగా చిత్తూరులో హరీష్ రెడ్డిపై కేసు నమోదు అయింది.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన భయంకరమైన తొక్కిసలాట సంఘటనపై న్యాయ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఇందులో భోలే బాబాకు క్లీన్ చిట్ లభించింది. 2024లో జరిగిన ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు.
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు. సంగారెడ్డి మండలంలోని ఫసల్ వాదీలో ఈ ఘటన చోటుచేసుకుంది.