Kolkata case: కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు!
అభయ అత్యాచార ఘటనపై కోల్కతాలో విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సచివాలయ ముట్టడిని పోలీసులు అడ్డుకోగా స్టూడెంట్స్ రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపారు. ర్యాలీని అడ్డుకోవద్దని గవర్నర్ ఆనంద్ సూచించారు.