TS: బీఆర్ఎస్ కు బిగ్ షాక్...కరీంనగర్ మేయర్ సునీల్ రావు రాజీనామా
బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, కరీంనగర్ మేయర్ అయిన సునీల్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈయన రేపు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, కరీంనగర్ మేయర్ అయిన సునీల్ రావు పార్టీకి రాజీనామా చేశారు. ఈయన రేపు బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
ఈటల రాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంపపై కొట్టడం సంచలనంగా మారింది. పోచారంలోని ఏకశిలానగర్లో కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తమ భూములను ఆక్రమించుకున్నారంటూ పలువురు ఈ రోజు ఈటలను ఆశ్రయించారు. దీంతో కోపానికి గురై బ్రోకర్ చెంప చెల్లుమనింపించారు.
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరైంది. కరీంనగర్లో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత కౌశిక్రెడ్డిపై నమోదైన రిమాండ్ రిపోర్టును కొట్టిపారేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ లోనే రాత్రి బస చేసిన కౌశిక్రెడ్డికి ఈరోజు ఉదయం స్టేషన్ లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన్ను నేడు జడ్జి ముందు హాజరుపరచనున్నారు.
ఈ నెల 12న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా వాయిదా పడింది. సంక్రాంతి పండగ ప్రయాణాలు, హైవేపై ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో ఈ ధర్నాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పండుగ తర్వాత ఈ ధర్నాను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. జగిత్యాలలో రెండు బైకులు ఢీకొని ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వైపు పెద్దపల్లిలో బైక్ ట్రక్కును ఢీకొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
న్యూ ఇయర్ వేడకల వేళ తెలంగాణ గంభీరావుపేటలో దారుణం జరిగింది. కూతురుకు శుభాకాంక్షలు చెప్పాడనే కోపంతో ఓ విద్యార్థిపై ఆమె కుటుంబ సభ్యులు దాడిచేశారు. దీంతో అవమానం తట్టుకోలేక శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. పరారిలో ఉన్న నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకోగా.. మరో 20 మంది కడుపునొప్పితో విలవిల్లాడారు. ఈ ఘటన గంగాధర మండలం బూర్గుపల్లిలో జరిగింది.