Mahakumbhabhishekam : కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ఈ మహాకుంభాభిషేకం పూజలు ఘనంగా జరిగాయి.