కోడితో కొత్త రోగం..! పురుషుల మగతనానికి సవాల్ | Antimicrobial Drug | RTV
సాధారణంగా శవపరీక్షలు పూర్తి కావడానికి కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. వర్చువల్ అటాప్సి విధానంలో ఎలాంటి కత్తిపోట్లు లేకుండానే అరగంటలో పూర్తవుతుంది. త్వరలోనే ఈ విధానం ఏపీకి అందుబాటులోకి రానుంది.
భారత్ లో 20 కోట్ల మందికి పైగా రక్తపోటుతో బాధపడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. వీరిలో 2 కోట్లమందికి మాత్రమే రక్తపోటు అదుపులో ఉందని పేర్కొంది. అసలు భారత్ లో రక్తపోటు ఈ స్థాయికి చేరుకోవటానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ దుష్ప్రభావాలపై బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది.
కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 30 శాతం మందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని బనారస్ యూనివర్సిటీ ప్రచురించిన నివేదికను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తోసిపుచుంది.వెంటనే ఈ నివేదికను ఉపసంహరించుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బనారస్ యూనివర్సిటీకి ICMR హెచ్చరించింది.
ఆరోగ్యకరమైన ఆహారంపై తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసిన ఐసీఎమ్ఆర్.. అధిక కొవ్వులు ఉండే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వివరించింది. వీటితో పోషకాల లేమి ఏర్పడి చివరకు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది.
టీ లేదా కాఫీని భోజనానికి ముందు లేదా తర్వాత తీసుకోవడం ప్రమాదం అని ఐసీఎంఆర్ హెచ్చరించింది. టీ, కాఫీలలో కెఫిన్ ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుందని వివరించింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్-B, సైంటిస్ట్-C పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను ప్రకటించింది. మొత్తం 31 ఖాళీలున్నాయి. ఫిబ్రవరి 16న అప్లై చేయడానికి లాస్ట్ డేట్. https://recruit.icmr.org.in/ ని విజిట్ చేసి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
యువతలో ఇటీవల సంభవిస్తున్న ఆకస్మిక మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్ కారణం కాదని ఐసీఎంఆర్ ఓ అధ్యయనంలో వెల్లడించింది. కేవలం జీవన శైలిలో వచ్చిన మార్పులు, మద్యం సేవించడం, అధికంగా జిమ్ చేయడం వంటి వాటి వల్లే మరణాలు వస్తున్నాయని ఐసీఎంఆర్ పేర్కొంది.