ICMR: ఏదైనా ప్రమాదాల్లో, క్రైమ్ ఘటనలో చనిపోయినవారిని సాధారణంగా శవపరీక్షలకు తరలిస్తుంటారు. కానీ ఇది కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదనను కలిగిస్తుంది. శవపరీక్షలో మృతుల శరీర భాగాలు కోయడం లాంటివి వారు జీర్ణించుకోలేరు. అందుకే కొంతమంది మెడికో లీగల్ కేసుల్లో కూడా శవపరీక్షలకు ముందుకు వచ్చేందుకు జంకుతుంటారు. రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే కత్తిగాట్లు అనేవే లేకుండా వర్చువల్ విధానంలో శవపరీక్ష చేసే సాంకేతికత త్వరలోనే ఏపీలో అందుబాటులోకి రాబోతుంది. ఎవరినైనా పోస్టుమార్టానికి తరలించినప్పుడు.. శవపరీక్షను వెంటనే పూర్తిచేసి పంపించడంతో పాటు వీటికి సంబంధించిన రిపోర్టులు కూడా న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయి.
పూర్తిగా చదవండి..ICMR: కత్తిగాటు లేకుండా శవపరీక్ష చేసే విధానం.. త్వరలో అందుబాటులోకి
సాధారణంగా శవపరీక్షలు పూర్తి కావడానికి కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. వర్చువల్ అటాప్సి విధానంలో ఎలాంటి కత్తిపోట్లు లేకుండానే అరగంటలో పూర్తవుతుంది. త్వరలోనే ఈ విధానం ఏపీకి అందుబాటులోకి రానుంది.
Translate this News: