తిరుమల శ్రీవారి ఆలయం పై హెలికాప్టర్ చకర్లు | Helicopter Flying On Tirumala Temple | RTV
మహారాష్ట్రలోని పూణె జిల్లా పౌడ్ అనే గ్రామం వద్ద ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యయి. ఈ హెలికాప్టర్ ముంబయి నుంచి హైదరాబాద్కు వెళ్తు్ండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
నేపాల్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఖాట్మండు నుంచి సియాఫ్రుబెన్సికి వెళ్తుండగా ఓ హెలికాప్టర్ కుప్పలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. నువాకోట్ సమీపంలో హెలికాప్టర్ కూలింది. మృతులు చైనాకు చెందినవారిగా గుర్తించారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఓ కార్యక్రమం కోసం గడ్చిరోలి వెళ్తుండగా.. ప్రతికూల వాతావరణ వల్ల వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది. చివరికి పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
ఒడిశాలోని భువనేశ్వర్లో వర్షం కారణంగా.. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భువనేశ్వర్ ల్యాండింగ్ కాలేదు. దాదాపు 30 నిమిషాల పాటు గాల్లోనే తిరిగింది. చివరికి ఝర్సుగూడలో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియా - నెవడా సరిహద్దుల్లో ఓ హెలికాప్టర్ కూప్పకూలింది. ఈ ఘటనలో నైజీరియాకు చెందిన'యాక్సెస్ బ్యాంక్' సీఈఓతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్లోనే లోక్ సభ ఎన్నికలను నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోందని ఆమె అన్నారు. క్యాంపెయిన్ కోసం ఇప్పటికే అన్ని హెలికాప్టర్లను కమల నాథులు బుక్ చేశారని వెల్లడించారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈ సారి దేశం 'నిరంకుశ' పాలనను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.