AP News : ఏపీ రైతులకు శుభవార్త.. ఆ కార్డు లేకపోయినా రూ.20 వేలు..!

ఆంధప్రదేశ్‌లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తోంది. అందులో భాగంగా మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.

New Update
 AP Annadata Sukhibhava Scheme

AP Annadata Sukhibhava Scheme

AP News :ఆంధప్రదేశ్‌లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా అమలు చేస్తోంది. అందులో భాగంగా మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మరోవైపు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో కౌలు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కౌలు రైతులలో చాలా మందికి సీసీఆర్‌ కార్డు లేదు. దీంతో తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. ఈ విషయమై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సీసీఆర్ కార్డుతో పనిలేకుండా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని తెలిపారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. 

 Also read :  తండ్రీ కొడుకులకు బలుపు తప్పా ఏముంది..రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

 నిజానికి ఏ రాష్ట్రంలోనైనా వ్యవసాయంలో మెజారిటీ వాటా కౌలు రైతులదే. అయితే ప్రభుత్వం, బ్యాంకుల నుంచి వారికి తగిన మద్దతు, ప్రోత్సాహం అందదు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధి పొలం యజమానులకు వెళ్తోంది. అలాగే పాసు పుస్తకాల సాయంతో భూమి యజమానులే బ్యాంకుల్లోనూ రుణాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలో ఆరుగాలం కష్టించి పంటను పండించే కౌలు రైతులు ఎటు తోచని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, వారి కోరల్లో చిక్కుకుపోతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు శుభవార్త చెప్పింది. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ వివరాలను వెల్లడించారు. కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: ఐదు సమస్యలను తొలగించే పటిక, పసుపు మిశ్రమం

అయితే కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం మరో రిలీఫ్ ఇచ్చింది. సీసీఆర్ కార్డులు లేకపోయినా కూడా అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందించే ఇన్‌పుట్ సబ్సిడీ, బ్యాంకు లోన్లు వంటి పథకాలు పొందేందుకు కౌలు రైతులకు ఈ సాగు అర్హత కార్డులు (సీసీఆర్) తప్పనిసరి. అయితే ఈ కార్డులు రావాలంటే భూమి యజమాని సహకారం ఉండాలి. కార్డుల జారీకి కావాల్సిన పత్రాలను భూమి యజమానులు అందిస్తేనే కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు లభించే అవకాశం ఉంటుంది. భూమి యజమానులు సహకరించకపోవటంతో చాలామంది కౌలు రైతులు సీసీఆర్‌ కార్డులు పొందలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వం అందించే సాయం పొందలేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేసవికాలంలో మామిడికాయను ఈ సమయంలో తినండి


ఈ నేపథ్యంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల కీలక ప్రకటన చేశారు. సీసీఆర్ కార్డులతో అవసరం లేకుండానే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ-పోర్టల్‌లో నమోదు చేసుకున్నవారికి అన్నదాత సుఖీభవ పథకం అందిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. మరోవైపు మే నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ.9,400 కోట్లు కేటాయించారు.

Also read :  రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు