రైతుల ఖాతాల్లో 10 వేల కోట్లు... ! | Ram Mohan Reddy Good News To Farmers For Rythu Bharosa | RTV
రైతు భరోసా పథకం కోసం కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 5 నుంచి 7 వరకు గ్రామసభలు నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించినట్లు సమాచారం. రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో ఈ అంశంపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు.
రైతులకు పంటల బీమా పథకాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు నష్టం తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ పథకాలను పొడిగించనున్నట్లు తెలిపింది. ఈ పథకంలో 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రైతులకు రూ.1,350కు ఇవ్వనుంది.
రైతు భరోసాపై లిమిట్ పెట్టాలని తెలంగాణకి కేబినేట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు గ్రూప్-1 ఆఫీసర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.