Hyderabad: నీటి సంపులో పడి సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి!
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ షేక్ అక్మల్ అనుకోని సంఘటనతో ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ అంజయ్యనగర్లోని షణ్ముఖ్ మెన్స్ పీజీ హాస్టల్లో ఉంటున్న యువకుడు అదే హాస్టల్ సంపులో పడి చనిపోయాడు. వీడియో వైరల్ అవుతోంది. హాస్టల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు.