Kerala: వయనాడ్లో మృత్యుఘోష.. 254కు చేరిన మృతుల సంఖ్య
కేరళలోని వయనాడ్లో మృత్యుఘోష పెరుగుతోంది. అక్కడ జరిగిన ప్రకృతి విలయానికి ఇప్పటికి 254 మంది చనిపోగా..ఇంకా 300 మంది ఆచూకీ దొరకలేదని తెలుస్తోంది.
కేరళలోని వయనాడ్లో మృత్యుఘోష పెరుగుతోంది. అక్కడ జరిగిన ప్రకృతి విలయానికి ఇప్పటికి 254 మంది చనిపోగా..ఇంకా 300 మంది ఆచూకీ దొరకలేదని తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత ఆరిఫ్ అకిల్ కన్నుమూశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరిఫ్ భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఢిల్లీలో పడిన భారీ వర్షానికి అక్కడ ఓ కోచింగ్ సెంటర్ మొత్తం నీటితో మునిగిపోయింది. దీంతో బిల్డింగ్ బేస్మెంట్లోకి విపరీతంగా నీరు చేరిపోయింది. ఈ వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు.
అమెరికాలో మరోసారి తూటా పేలింది. సోమవారం రాత్రి ఓ దుండగుడు వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మరణించారు. లాస్ వెగాస్ కు సమీపంలో జరిగిన ఈ కాల్పుల్లో ఓ బాలిక తీవ్రంగా గాయాలపాలైంది. నిందితుడ్ని ఎరిక్ ఆడమ్స్ (57) గా అధికారులు గుర్తించారు.
హజ్ యాత్రకు వెళ్ళినవారిలో చాలామంది మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా దాదాపు 1000 మంది చనిపోయారు. ఇందులో 98మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. మనదేశం నుంచి ఇప్పటివరకు 1.75 లక్షల మంది వెళ్ళినట్లు తెలిపింది.
సౌదీ అరేబియాలో ఎండ తీవ్రత హజ్ యాత్రికులను అల్లకల్లోలం చేస్తుంది. వేడి వల్ల ఇప్పటి వరకు హజ్ యాత్రలో కనీసం 550 మంది హజ్ యాత్రికులు చనిపోయారు.ఈజిప్ట్ దేశస్థులు ఎక్కువగా మరణించారు.
మలావీ ఉపాధ్యక్షుడు 'సౌలస్ షిలిమా' ప్రయాణించే విమానం తప్పిపోయిన కథ విషాందాంతమైంది. అందులో ఉన్న 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. అందులో ఎవరూ ప్రాణాలతో లేరు' అని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు.
రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిష్ రావు తల్లి ఈ రోజు మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె కరీంనగర్ హాస్పిటల్ లో మరణించారు. తల్లి మృతి పై రాధా కిషన్ రావు అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.