Cricket: గ్రేట్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ మృతి
కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న లెజెండ్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. 71 ఏళ్ళ వయసులో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గైక్వాడ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు.
కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న లెజెండ్ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూశారు. 71 ఏళ్ళ వయసులో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. గైక్వాడ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు.
అమెరికా, వెస్ట్ ఇండీస్లో జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో మ్యాచ్ ఫిక్సింగ్ అలజడి రేగింది. కెన్యా నుంచి వచ్చిన మాజీ క్రికెటర్ ఓ ఉగాండా ప్లేయర్ను సంప్రదించాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఉగాండా ఆటగాడు ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది.
క్రికెటర్ జోస్ బట్లర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ తన బయోపిక్లో నటించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. కొన్ని రోజుల క్రితం షారుఖ్ జోస్ బట్లర్ను హగ్ చేసుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలైంది. ఆటలో జోస్ మంచి ప్రదర్శనకు షారుఖ్ అభినందనలు కూడా తెలిపారు.
భారతీయుల అభిమాన క్రికెటర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ డ్రైవర్ అవతారం ఎత్తాడు. ఈ వీడియో వైరల్గా మారడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ముంబై ఇండియన్స్ టీమ్ వెళ్తున్న బస్సును నడిపాడు. రోహిత్ శర్మ బస్సు డ్రైవర్గా మారిన వీడియో చూడాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్రికెట్పై మరోసారి అభిమానం చాటుకున్నాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టుతో కలిసి నెట్ సెషన్లలో పాల్గొన్నారు. తన బ్యాటింగ్ నైపుణ్యాలతో జట్టు సభ్యుల్ని ఆశ్చర్యపరిచారు. వీడియో వైరల్గా మారడంతో పలువురు బ్యాటింగ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
పపువా న్యూ గినియా ఆల్రౌండర్ కైయా అరుహ (Kaia Arua) కన్నుమూసింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన 33 ఏండ్ల వయసులో ప్రాణాలు విడిచింది. దాంతో, పువా న్యూ గినియా క్రికెట్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
ఇండియన్ క్రికెటర్, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్న గౌతమ్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఇక మీదట తన ఫోకస్ అంతా క్రికెట్ మీదనే అని తేల్చి చెప్పారు.
నిన్న అగర్తలా-ఢిల్లీ విమానంలో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన సీటు ముందున్న ప్లాస్టిక్ కవర్లో ఉన్న ద్రవాన్ని మంచినీళ్ళు అనుకుని తాగడంతో అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వెంటనే విమానం ఆపి అతన్ని ఆసుపత్రికి తరలించారు.
ప్రొఫెషనల్ ఆటకు , రాజకీయాలకు సంబంధం ఉండకూడదు కాబట్టే నేను వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు క్రికెటర్ అంబటి రాయుడు పేర్కొన్నారు. వైసీపీలో చేరిన పది రోజులకే పార్టీని విడడంతో వైసీపీ మీద ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.