CM Jagan: వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
హిందూపురంలో సీఎం జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ పంచ్ డైలాగులు వేశారు. ఎన్నికల్లో జగన్ ను మట్టిలో కలిపేస్తామన్నారు. 'నా దళితులంటునే దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తాడు. నాయకుడు అంటూనే నయవంచకుడిగా మారాడు.. అక్కచెల్లెళ్ల ఉసురు పోసుకుంటున్నాడు' అని దుమ్మెత్తిపోశారు.
సీఎం జగన్కు.. దివగంత నేత వైఎస్ వివేక సతిమణి సౌభాగ్యమ్మ సంచలన లేఖ రాశారు. ఈ లేఖలో జగన్ తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. వివేక హత్యకు కారణమైన వాళ్లకు జగన్ రక్షణగా ఉంటున్నారంటూ నిలదీశారు.
AP: మేమంతా సిద్ధం బస్సు యాత్రను ముగించుకున్న సీఎం జగన్.. రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య నామినేషన్ దాఖలు వేయన్నారు. ఇప్పటికే జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ వేశారు ఎంపీ అవినాష్ రెడ్డి.
AP: తనకు డబ్బులు అవసరంలేదని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రజలకు సేవ నాయకత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అన్నింటిలో రాష్ట్రం వెనుకంజలో ఉందని పేర్కొన్నారు. గంజాయిలో మాత్రమే రాష్ట్రం నంబర్ 1గా ఉందని ఎద్దేవా చేశారు.
AP: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్కు మద్దతుగా ఇప్పటివరకు 62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఉంటారని పేర్కొన్నారు. దీనిపై విచారణను 2 వారాలకు కోర్టు వాయిదా వేసింది.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ఆంధ్రాలోని వైసీపీ పార్టీ అన్ని రకాలుగా సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ అధినేత జగన్ బస్సు యాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేశారు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో తమ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు కూడా రెడీ అయ్యారు.
ఏప్రిల్ 26 సీఎం జగన్ తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. గుంటూరులోని తాడేపల్లిలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే వైసీపీ ఏం చేస్తుందనే దానిపై క్లారిటీ రానుంది.
AP: ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీలోని కీలక అధికారులపై ఈసీ వేటు వేసింది. విజయవాడ సీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం జగన్ పై దాడి, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.