Adinimmayapalli dam : ప్రాణం తీసిన ఈత సరదా...బతుకు తెరువుకోసం వచ్చి...
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద ఈత కొట్టేందుకు వెళ్లిన యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. వారికోసం పోలీసులు తీవ్రంగా గాలించి ఎట్టకేలకు మృతదేహాలను వెలికితీశారు. మృతులు నేపాల్ కు చెందినవారు.