నేడు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్
AP: ఈరోజు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
AP: ఈరోజు ఇంద్రకీలాద్రి దుర్గగుడికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
తన కాలేజీలవైపు హైడ్రా బుల్డోజర్లు రాకుండా ఆపడానికి.. ఆస్తులపైకి ఈడీ దాడులు చేయకుండా ఉండేందుకు మల్లారెడ్డి కొత్త స్కెచ్ వేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీలో చేరి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రేవంత్ సర్కార్ కు దగ్గర అవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు, ఇది ఇలాగే కొనసాగించాలని సూచించారు.
తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై CBI, ఏపీ పోలీస్, FSSAI అధికారులతో సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్టు చేసిన చంద్రబాబు.. సత్యమేవ జయతే, ఓం నమో వేంకటేశాయ! అని పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరుమలలో నూతనంగా నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు.
ఏపీ టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎన్సీఆర్టీ పుస్తకాల్లోని హిందీ పాఠాలు కష్టంగా ఉండటంతో పదవ తరగతిలో నాలుగు పాఠాలను తొలగిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తనపై కస్టోడియల్ హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు, సీఐడీ విజయపాల్, డాక్టర్ ప్రభావతిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గత పాలకుల కారణంగా విజయవాడలో వరద తీవ్రత పెరిగిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధితులకు సాధ్యమైనంత సాయం చేశామన్నారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన వ్యవహరంలో కచ్చితంగా వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు.
ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది చంద్రబాబు సర్కార్. ఆర్టీసీ ఛైర్మన్గా కొనకళ్ల నారాయణ, ఏపీ టూరిజం ఛైర్మన్గా బాలాజీ, APIIC ఛైర్మన్గా రామరాజును నియమించింది. ప్రకటించిన మొత్తం 20పదవుల్లో టీడీపీకి 16, జనసేనకి 3, బీజేపీకి ఒకటి దక్కాయి.