ఓటర్ పల్స్ పట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టీడీపీ!
ఓటర్ పల్స్ పట్టుకోవడానికి టీడీపీ సిద్ధమైంది.. రాబోయే ఎన్నికల పై ఏపీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజలేమనుకుంటున్నారు వంటి అంశాల మీద ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసినట్లు సమాచారం.. టీడీపీ పొలిటికల్ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆధ్వర్యంలో మంగళగిరి లో పార్టీ కార్యాలయంలో దీని కోసం ప్రత్యేకంగా టీమ్ ను సిద్ధం చేసినట్లు సమాచారం.