KCR In Telangana Assembly | నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. | CM Revanth Reddy | RTV
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మార్చి 12 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ వస్తారని తెలిపారు. అలాగే తెలంగాణలో రేవంత్ అండ్ టీమ్ చేస్తున్న ప్రైవేటు దోపిడీ పెరుగుతోందని, ప్రభుత్వ ఆదాయం తగ్గుతోందని విమర్శించారు.
యూపీలోని అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే పాన్ మసాలా నమిలి ఉమ్మివేశారు. దీంతో స్పీకర్ దాన్ని సిబ్బందితో శుభ్రం చేయించారు. సభా ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలని సభ్యులను కోరారు. ఎవరు ఇలా ఉమ్మేశారో తనకు తెలుసని.. వారు నా దగ్గరికి వచ్చి వివరణ ఇవ్వాలన్నారు.
2025-26 ఏపీ బడ్జెట్కు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి సారిగా బడ్జెట్ పత్రులను ముద్రించకుండా పెన్డ్రైవ్ రూపంలో పంపించనున్నారు. ప్రస్తుత బడ్జెట్ పుస్తకాల ముద్రణకు స్వస్తి పలికింది. పద్దుల వివరాలు పెన్డ్రైవ్ రూపంలో సభ్యులకు, మీడియాకు ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత సభ వాయిదా వేసి బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. 3వారాల పాటు సమావేశాలు ఉండనున్నట్లు ప్రాథమిక సమాచారం.