AP : వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్..!
బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల లారీని పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తుండగా తుళ్ళూరు పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీని, లారీ డ్రైవర్ చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.
బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుల లారీని పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తుండగా తుళ్ళూరు పోలీసులు అడ్డుకున్నారు. ఇసుక తరలిస్తున్న లారీని, లారీ డ్రైవర్ చెన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.
విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటివలే వీసీగా రాజీనామా చేసిన ప్రసాద్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రసాద్ రెడ్డిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలేది లేదని ఎంపీ సీఎం రమేశ్ స్పష్టం చేశారు.
పోలవరం కాంట్రాక్టర్ను మార్చితే అది తివ్రమైన విపత్తుకు దారి తీస్తుందని 2019లో నాటి వైసీపీ సర్కార్కు జలశక్తి మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఆ లెటర్ను ఇప్పుడు టీడీపీ వైరల్ చేస్తోంది. రివర్స్ టెండర్ ఆలోచన సరైనది కాదని మండిపడుతోంది. రాష్ట్రానికి పట్టిన శని జగన్ అని ఫైర్ అవుతోంది.
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో పెళ్లి వార్తలపై నటి శ్రీరెడ్డి క్లారిటీ ఇచ్చింది. బైరెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుందని అన్నాను. కానీ తాను అంత హాట్ కేకును కాదని చెప్పింది. అనవసరంగా మా మీదపడి ఏడవొద్దు. మాకు పెళ్లి, రిలేషన్ ఏమీ లేదు. బైరెడ్డి జీవితాన్ని నాశనం చేయొద్దని కోరింది.
రాష్ట్రంలో బ్రాండెడ్ మద్యం దొరకకపోవడం తమ ఓటమిలో కీలక పాత్ర పోషించిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంకా ఇసుక కొరత కారణంగా కార్మికులు ఉపాధి కోల్పోవడం కూడా తమను దెబ్బకొట్టిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రభావం కూడా నష్టం చేసిందన్నారు.
నిర్మాణాల్లో ఉన్న వైసీపీ ఆఫీసులకు నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26 జిల్లాల్లో వైసీపీ ఆఫీసుల నిర్మాణం చేపట్టగా.. ఒక్కదానికి కూడా అనుమతి లేదని తెలుస్తోంది. ఇదంతా మొత్తం రూ.2 వేల కోట్ల స్కామ్ అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ (CRDA) అధికారులు కూల్చివేస్తున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5.30 AM గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేత పనులు మొదలుపెట్టారు.
AP: ఈరోజు సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టారు. వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదని విమర్శించారు. తప్పు చేసిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పోలవరానికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు.
AP: ఈరోజు హైకోర్టులో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈవీఎం ధ్వంసంతో సహా మరో రెండు కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్పై ఉన్నారు. కాగా ఆయనకు బెయిల్ పొడిగిస్తారా లేదా అదుపులోకి తీసుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది.