సీఎం చంద్రబాబు రూమ్ చూస్తే మతిపోవాల్సిందే.. | CM Chandrababu Special Room At Mahanadu | Kadapa | RTV
ఏపీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏనుగులు గ్రామాలు, పంట పొలాల్లోకి చేరి పంటలను నాశనం చేయడం, అడ్డువచ్చిన వారిపై దాడి చేస్తూ వారిని చంపుతున్నాయి. వీటిని నిరోధించాలంటే కుంకీ ఎనుగులను మొహరించాలని నిర్ణయించారు. దీనికోసం కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులు ఏపీకి చేరాయి.
ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకమైన గోవిందప్ప బాలాజీ ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. గోవిందప్పను మైసూర్ లో అరెస్ట్ చేసిన సిట్ అధికారులు విజయవాడ కు తరలిస్తున్నారు.
ఏపీలోని విజయవాడలో ఉన్న పాకిస్తాన్ కాలనీ పేరు మారింది. ఆ కాలనీ పేరువల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతుండటంతో అధికారులు స్పందించారు. ఆ కాలనీకి కొత్తపేరు పెట్టారు. భగీరథ కాలనీగా కొత్త పేరును నామకరణం చేశారు. ఆధార్లో స్థానికుల అడ్రస్ కూడా మార్చారు.
సంచలనం సృష్టించిన ఏపీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి , ధనుంజయరెడ్డి , బాలాజీ గోవిందప్పలను ఈ రోజు (ఆదివారం) విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ వారు ఈ రోజు విచారణకు హజరుకాకపోవడం చర్చనీయంశంగా మారింది.