AP News: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కొత్త శిక్షలు.. ఫైన్‌తోపాటు కమ్యూనిటీ సర్వీస్

తూర్పుగోదావరి జిల్లాలో బెంచ్ కోర్ట్ జడ్జి అజయ్ వినూత్నమైన తీర్పునిచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 13 మందికి రూ. 300 జరిమానాతోపాటు నిడదవోలు రైల్వే స్టేషన్, సంత మార్కెట్ పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు.

New Update
ap news

ap news

డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది రోడ్డు భద్రతకు పెద్ద ముప్పు చేసే ఒక నేరం.  మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవర్ల ఆలోచనా శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ప్రతిస్పందించే వేగం తగ్గుతాయి. దీని ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల కేవలం డ్రైవర్లకు మాత్రమే కాకుండా.. రోడ్డుపై ఉన్న ఇతర వ్యక్తుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కఠినంగా నిర్వహిస్తారు. ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు, జైలు శిక్షలు, లైసెన్స్ రద్దు లాంటి శిక్షలు ఉంటాయి. కాబట్టి.. మద్యం సేవించి వాహనం నడపకుండా ఉండటం మనందరి బాధ్యత. అయితే ఏపీలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కొత్త శిక్షలు ఇవ్వాలని బెంచ్ కోర్ట్ జడ్జి వినూత్నమైన తీర్పునిచ్చారు.

పాలిటీలో కమ్యూనిటీ సర్వీస్ చేయాలని..

తూర్పుగోదావరి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, రాత్రి వేళల్లో రోడ్లపై తిరిగే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు చేపట్టిన ఈ ప్రత్యేక చర్యల్లో భాగంగా పట్టుబడిన వారిని బెంచ్ కోర్ట్ జడ్జి అజయ్ ఎదుట హాజరుపరిచారు. కేవలం ఫైన్ విధించడం వల్ల నిందితులలో మార్పు రావడం లేదని గ్రహించిన జడ్జి అజయ్.. వినూత్నమైన తీర్పునిచ్చారు. ఫైన్‌తోపాటు మున్సిపాలిటీలో కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు పట్టుబడిన వారికి రూ. 300 జరిమానాతోపాటు నిడదవోలు రైల్వే స్టేషన్, సంత మార్కెట్ పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలలో పాల్గొనాల్సిందిగా ఆదేశించారు.

ఇది కూడా చదవండి: పట్టపగలు నడిరోడ్డుపై దారుణం...భార్యను కాల్చి చంపి...

ఈ ప్రత్యేక కార్యక్రమంలో సమిశ్రగూడెం స్టేషన్ పరిధిలో 5 మంది నిడదవోలు స్టేషన్ పరిధిలో 8 మంది చొప్పున మొత్తం 13 మంది పాల్గొన్నారు. వీరంతా నిడదవోలు రైల్వే స్టేషన్ మరియు సంత మార్కెట్ పరిసరాల్లోని చెత్తను తొలగించి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమానికి నిడదవోలు పట్టణ ఎస్సై జగన్మోహనరావు, మున్సిపల్ ఏఈలు హేమంత్, అనిత మరియు పోలీసు సిబ్బంది హాజరయ్యారు. ఈ చర్యల యొక్క ప్రధాన లక్ష్యం నిందితులలో మార్పు తీసుకురావడమే అని అధికారులు తెలిపారు. జరిమానా మాత్రమే కాకుండా సమాజానికి సేవ చేయడం ద్వారా తమ తప్పును గుర్తించే అవకాశం వారికి లభిస్తుందని భావిస్తున్నారు. ఈ కొత్త విధానం నేరస్తులలో సానుకూల మార్పు తీసుకువస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ వినూత్న కార్యక్రమం ప్రజల నుంచి మంచి స్పందన పొందుతోంది.

ఇది కూడా చదవండి: ఎంతకు తెగించార్ర...శ్మశానవాటికలో ఆ పని...పోలీసులు షాక్‌

Advertisment
తాజా కథనాలు