/rtv/media/media_files/2025/06/05/owlhlEk1wx1p0GGvbTJn.jpg)
visakhapatnam 14 year old girl infected with new coronavirus omicron
దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రాల వారీగా రోజుకు పదుల సంఖ్యలో కేసులు పెరగడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పరిస్థితి రోజు రోజుకూ మారిపోతుందనడానికి దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులే నిదర్శనం. ఇవాళ్టికి (జూన్ 5) దేశ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదు అయ్యాయి.
ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు
దేశంలో 5వేల కేసులు . .
దాదాపు 5వేల కేసులు నేటికి నమోదు అయ్యాయి. అందులో నిన్న (జూన్4) ఒక్కరోజే 1200 కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో ఈ డేటా చూసి ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు ఏపీలోని వైజాగ్లో కరోనా కేసు నమోదు అయింది. అయితే ఇది కొత్త వేరియంట్ కావడంతో విశాఖ వాసులు ఆందోళన చెందతున్నారు.
ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు
వైజాగ్కు చెందిన 14 ఏళ్ల బాలికకు కొత్త కరోనా వేరియంట్ సోకింది. ఇది ఒమిక్రాన్ వేరియంట్గా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ బాలికను కేజీహెచ్ హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మూడు వచ్చాయని కేజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శివానందం తెలిపారు.
ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!
దీంతో విశాఖలో 14 ఏళ్ల బాలికకు కొత్త ఒమిక్రాన్ వేరియంట్తో మొత్తం నాలుగు కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. జలుబు, జ్వరం, దగ్గు వస్తే నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు. .