Free Bus Schemes: ఏపీ, తెలంగాణలో ఉచిత బస్సు  ప్రయాణం.. తేడా ఈ ఒక్కటే!

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తు్‌న్న ఈ ఫథకాల్లో రూల్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. తెలంగాణలో ఆధార్ కార్డు ప్రమాణికం కాగా.. ఏపీలో ఏ గుర్తింపు కార్డు చూపించిన జీరో టికెట్ జారీ చేస్తారు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్,  ఘాట్ రోడ్లలో నడిచే బస్సుల్లో ఈ పథకం అమలు కాదు.

New Update
free bus

Free Bus Schemes: ఏపీ(AP), తెలంగాణ(Telangana)లోని ప్రభుత్వాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళలకు హామీ ఇచ్చిన మేరకు  ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మొత్తానికి అమలు చేశాయి. ముందుగా తెలంగాణ ప్రభుత్వం "మహాలక్ష్మి" అనే పేరుతో ఈ ఉచిత బస్సు పథకాన్ని 2023 డిసెంబర్ 9న ప్రారంభించింది. రాష్ట్రంలోని  బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్స్ ఈ పథకానికి అర్హులు. దీనికి వయస్సుతో సంబంధం లేదు. ఈ పథకం కింద  TSRTCకి చెందిన సిటీ బస్సులతో పాటుగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.  ఏసీ బస్సులు, నాన్-ఏసీ గరుడ, వజ్ర, ఇంద్ర, సూపర్ లగ్జరీ, అంతర్-రాష్ట్ర సర్వీసులకు ఈ పథకం వర్తించదు. అయితే ఈ పథకం మొదలుపెట్టినప్పుడు  రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డులో ఏదో ఒకటి చూపించిన ఉచిత టికెట్ జారీ చేశారు. కానీ ఆ తర్వాత ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఈ పథకం అమలుకు తెలంగాణ ప్రభుత్వం నెలకు సుమారు  రూ. 300 కోట్లు ఖర్చు చేస్తుందని అంచనా. ఈ పథకం ద్వారా TSRTC బస్సులలో ఆక్యుపెన్సీ రేషియో 67% నుంచి 95%కి పెరిగింది. ఈ పథకం మహిళలకు రూ.6,671 కోట్ల ఆర్థిక భారం తగ్గించింది.

Also Read: "50 ఏళ్ల లెజెండరీ జర్నీకి హాట్స్ ఆఫ్..!" మోడీ, చంద్రబాబు విషెస్ కు తలైవర్‌ రిప్లై ఇదే..

స్త్రీ శక్తి పేరుతో 

ఇక ఏపీ విషయానికి వస్తే..  కూటమి ప్రభుత్వం  "స్త్రీ శక్తి" అనే పేరుతో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని 2025 ఆగస్టు 15న ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ పథకం APSRTCకి చెందిన ఐదు రకాల బస్సులు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ లకు వర్తిస్తుంది. నాన్-స్టాప్ సర్వీసులు, అంతర్-రాష్ట్ర సర్వీసులు, సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (తిరుమల-తిరుపతి మధ్య నడిచే బస్సులు), అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, ఘాట్ రోడ్లలో నడిచే బస్సులు (ఉదా. పాడేరు, శ్రీశైలం ఘాట్లలో) ఈ పథకం వర్తించదు. ఈ ఉచిత ప్రయాణం కోసం లబ్ధిదారులు తమ గుర్తింపు కార్డులో ఏదైనా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఇతర గుర్తింపుకార్డులు చూపించిన జీరో టికెట్ జారీ చేస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం ఆర్టీసీ బస్సులలో దాదాపు 74% బస్సులలో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ఈ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APSRTCకి సంవత్సరానికి సుమారు రూ. 1,970 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఈ పథకం ద్వారా మొత్తం ఆర్టీసీ బస్సులలో దాదాపు 74% బస్సులలో ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుంది.

Also Read: ఏం మనిషివిరా... ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి ఆపై..

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అమలు చేస్తు్‌న్న ఈ ఫథకాల్లో రూల్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. తెలంగాణలో ఆధార్ కార్డు ప్రమాణికం కాగా.. ఏపీలో ఏ గుర్తింపు కార్డు చూపించిన జీరో టికెట్ జారీ చేస్తారు. ఇక  సప్తగిరి ఎక్స్‌ప్రెస్,  ఘాట్ రోడ్లలో నడిచే బస్సుల్లో ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. 

Advertisment
తాజా కథనాలు