Andhra Pradesh: సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేది బదిలీ
సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. గోపాలకృషణను బదిలీ చేయడం ఇది ఇప్పటికి రెండోసారి.
సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయనను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. గోపాలకృషణను బదిలీ చేయడం ఇది ఇప్పటికి రెండోసారి.
రాజధాని పనులు తిరిగి ప్రారంభమైతే తిరుమలకు పాదయాత్రగా వస్తామని గతంలో అమరావతి రైతులు మొక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రాజధాని పనుల్లో కదలిక రావడంతో తిరుమల వెంకటేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి, మొక్కు చెల్లించుకోవడానికి రైతులు యాత్ర మొదలు పెట్టారు.
చంద్రన్న బీమా పరిహారాన్ని పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ఇంతకు ముందు ఇది రూ. 3 లక్షలు ఉండగా..ఇప్పుడు దానిని 10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్ తెలిపారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి కేబినెట్ భేటి నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఏపీ కేబినేట్ సమావేశం అవ్వనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గానికి దిశానిర్దేశం చేయనున్నారు.
రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు 280 మంది లోక్ సభ ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ మోహతాజ్. రెండవ రోజు మిగిలిన 264 మంది ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు.
విభజన వల్ల వచ్చిన ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి,గడిచిన 5 ఏళ్లలో ఆర్ధిక పరమైన తప్పులను సరిదిద్దాడానికి కేంద్ర సహకారం ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.ఢిల్లీలో జరిగిన ప్రీ బడ్జెట్, జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు.
ఆంధ్రాలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఈరోజు దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు. మొత్తం 18మంది ఐఏఎస్లను బదిలీ చేశారు.
గతంలో రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను వైసీపీ నేతలు అవమానించారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. తన సతీమణినే కాకుండా రాష్ట్రంలో ఆడబిడ్డలందరిని కించపరిచేలా వాళ్లు మాట్లాడరని అందుకే కన్నీళ్లు పెట్టుకున్నానని వ్యాఖ్యానించారు.