Final Audio Message In Air India Flight | ప్లేన్ లో ఆఖరి వీడియో | Ahmedabad Plane Crash | RTV
ఎయిరిండియా విమానంలో తానూ ప్రయాణించానని మంచు లక్ష్మి తాజాగా పోస్టు చేసింది. అయితే అహ్మదాబాద్ నుంచి కాకుండా ముంబై నుంచి లండన్కు వెళ్లానని తెలిపింది. ఈ విషాదకరమైన విమాన ప్రమాదంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొంది.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 274కి చేరింది. మొదట 265 మంది చనిపోయినట్లు నిర్ధారించగా తాజాగా మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. బీజే మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది చనిపోయారు. ప్రమాదం జరగగానే 24మంది.. చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు.
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బార్మర్కు చెందిన 20 ఏళ్ల వైద్య విద్యార్థి జైప్రకాష్ మరణించాడు. అతడు హాస్టల్లో భోజనం చేస్తుండగా విమానం పడి మృతి చెందాడు. అతడి మృతదేహం గ్రామానికి చేరుకోగానే అక్కడ శోకసంద్రం అలుముకుంది.
ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్లో కూలిపోయింది.
గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో సుమారు 241 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. ఆయనలాగే ఇప్పటివరకు ఇలా విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన నేతలు చాలామందే ఉన్నారు.