Hussain Sagar Boat Burning : హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంలో ఒకరి మృతి... ఇంకా దొరకని అజయ్ అచూకీ
హుస్సేన్ సాగర్ లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం ఘటనలో ఒకరు మృతిచెందారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్లో జరిగిన 'భారత మాతకు మహా హారతి' కార్యక్రమంలో పడవలో బాణసంచా పేలడం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి చికిత్స పొందుతూ మృతిచెందాడు.