కేంద్ర కేబినెట్ పదవులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అజిత్ పవార్ వర్గం అంసతృప్తి వ్యక్తం చేస్తోంది. కేబినేట్లోకి ప్రఫుల్ పటేల్ పేరును ఎన్సీపీ సూచించింది. కానీ బీజేపీ ప్రఫుల్కు సహాయమంత్రి పదవి ఇస్తామని స్పష్టం చేసింది. గతంలోనే తాను కెబినేట్ మంత్రిగా పనిచేశానన్న ప్రఫుల్ పటేల్.. ఈసారి సహాయ మంత్రి చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమోషన్ కాదు డిమోషన్ అంటూ వాపోయారు. అయితే కొన్ని రోజుల పాటు వేచిచూడాలని.. భవిష్యత్లో అవకాశం ఇస్తామని బీజేపీ పెద్దలు ప్రఫూల్కు సూచించారు.
ncp
Sharad Pawar: 2014 నుంచి బీజేపీ నేతలపై ఈడీ చర్యలు లేవు: శరద్ పవార్
మహారాష్ట్రకు చెందిన ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు శరద్ పవార్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఆదివారం పుణెలో ఆయన పార్టీ నిర్వహించిన ఆరోగ్య దూత్ అభియాన్ అనే కార్యక్రమానికి శరద్ పవర్ హాజరయ్యారు.
Also Read: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై సామూహిక అత్యాచారం
బీజేపీ నేతలపై విచారణలు లేవు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్లపై అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2005 నుంచి 2023 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 6వేల కేసులపై ఈడీ దర్యాప్తు చేసిందని అన్నారు. కేవలం 25 కేసుల్లో మాత్రమే పురోగతి కనిపించిందని తెలిపారు. 85 శాతం కేసుల్లో విపక్ష రాజకీయ నాయకులు ఉన్నారని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి ఆ పార్టీకి చెందిన ఏ నాయకుడిపై కూడా ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నేతలపై విచారణలు మొత్తానికి ఆగిపోయాయని విమర్శించారు.
ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలే
అయితే మరోవైపు NCPని చీల్చి షిండే ప్రభుత్వంలో అజిత్ పవర్ వర్గం చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆ వర్గాన్నే ఎన్నికల సంఘం గుర్తించడం.. పార్టీ సింబల్ గడియారాన్ని ఆ వర్గానికి కేటాయించడంపై శరద్ పవార్ స్పందించారు. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎప్పుడు చూడలేదని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయానికి ప్రజలు ఎప్పటికీ మద్దతు ఇవ్వరని తెలిపారు. తన తొలి ఎన్నికల్లో రెండు ఎడ్ల గుర్తుపై పోటీ చేసినట్లు చెప్పారు. ఎన్నికల చిహ్నం కంటే.. ఆలోచనలు, భావజాలం చాలా మఖ్యమని తెలిపారు. ఇక చివరగా.. ఈసీ కేటాయించిన కొత్త పేరు, సింబల్పై సోమవారం చర్చిస్తామని స్పష్టం చేశారు.
Also Read: ‘ఛలో ఢిల్లీ’కి పిలుపునిచ్చిన రైతులు.. బార్డర్లు మూసేసిన ప్రభుత్వం
Sharad Pawar: శరద్పవార్ కు ఈసీ నోటీసులు
Sharad Pawar: మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్సీపీ నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గాన్ని అసలైన ఎన్సీపీగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. శరద్పవార్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ గడియారం గుర్తును అజిత్ వర్గానికి కేటాయించింది.
EC settles the dispute in the Nationalist Congress Party (NCP), rules in favour of the faction led by Ajit Pawar, after more than 10 hearings spread over more than 6 months.
Election Commission of India provides a one-time option to claim a name for its new political formation… pic.twitter.com/1BU5jW3tcR
— ANI (@ANI) February 6, 2024
ఇది కాంగ్రెస్ కు షాకే..
లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించాలని విపక్షా పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల కమిషన్ మహారాష్ట్ర లోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్పవార్ కు ఊహించని షాక్ ఇచింది ఇచ్చింది. పార్టీ, చిహ్నం అజిత్ పవార్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికలల్లో మహారాష్ట్రలో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీనికి ప్రధాన కారణం శరద్ పవార్ ఇండియా కూటమిలో ఉండడమే. పార్టీ పేరు, చిహ్నం అజిత్ పవార్ కు కేటాయించడంతో ఆ పార్టీ పూర్తి హక్కులు శరద్ పవార్ చేతి నుంచి చేజారాయి.
Serious inconsistencies in terms of timelines in the claim of the Sharad Pawar group, in support of their claim of having organizational majority, resulted in unreliability of their claim. Taking into account the significant timeline of the elections to the 6 seats of Rajya Sabha…
— ANI (@ANI) February 6, 2024
బీజేపీకి ప్లస్…
ఎన్సీపీ విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం బీజేపీకి ప్లస్ పాయింట్ అయింది. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో అడ్డంకి లేకుండా చేసింది. దీనికి ప్రధాన కారణం కొద్ది నెలల క్రితం వరకు అజిత్ పవార్ ఇండియా కూటమిలోనే ఉండేవాడు. కానీ ఇటీవల రాజకీయ పరిణామాలు మారడంతో తన వర్గం ఎమ్మెల్యేను తీసుకొని అజిత్ పవార్ బీజేపీ, శివసేనల కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగం అయ్యారు. దీంతో మహారాష్ట్రలో బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని అనేదే లేకుండా అయింది. ఇది శరద్ పవార్ తో పాటు ఇండియా కూటమికి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
DO WATCH:
Sharad Pawar : రామమందిరం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది కానీ..కేంద్రం నుంచి నాకు ఆహ్వానం అందలేదు..!!
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పలేనన్నారు. ఏది ఏమైనా రామాలయం ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి శరద్ పవార్ దూరం కానున్నట్లు వార్తలు రాగా…ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.
కాగా 2024 జనవరి 24న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్షనేతలతో సహా ప్రముఖులకు కేంద్రం ఆహ్వానం పంపించింది. అయితే రామమందిర ప్రారంభోత్సవానికి శరద్ పవార్ దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. రామాలయ ప్రారంభోత్సవానికి మీరు వెళ్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పష్టత నిచ్చారు. ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఈ ముఖ్యమైన ప్రాజెక్టుల అభివృద్ధి గురించి రాష్ట్రపతికి తెలియజేయడమే సంభాషణ యొక్క ఉద్దేశ్యం.అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరిలను పవిత్రోత్సవానికి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొంటారా లేదా అనే విషయంపై పార్టీ నుంచి సమాచారం లేదు.
శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ వేడుకలకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను కూడా ఆహ్వానించింది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం నుంచి 12.45 గంటల మధ్య గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ట్రస్ట్ నిర్ణయించింది. వేద పూజారి లక్ష్మీకాంత దీక్షిత్ ఆ రోజున ముడుపుల ప్రధాన క్రతువులను నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: విజయ్ కాంత్ మన తెలుగోడే…ఆంధ్ర నుంచి వలస వెళ్లిన విజయ్ కాంత్ కుటుంబం..!!
ప్రధాని అయ్యే అవకాశం పవార్ కు రెండు సార్లు వచ్చింది…కానీ…. సైరస్ పూనావాల కీలక వ్యాఖ్యలు…!
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ ఎస్ పూనావాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు గతంలో రెండు సార్లు వచ్చిందని ఆయన అన్నారు. కానీ ఆ రెండు సందర్బాల్లో ఆయన ఆ అవకాశాన్ని మిస్ అయ్యారని చెప్పారు. ఇప్పుడు పవార్ కు వయస్సు మీదపడిందన్నారు. అందుకే పవార్ రాజకీయాల నుంచి రిటైర్డ్ కావాలని సూచించారు.
ప్రధాన మంత్రి అయ్యే అవకాశం శరద్ పవార్ కు రెండు సార్లు వచ్చినా ఆయన దాన్ని వినియోగించుకోలేకపోయాడని అన్నారు. పవార్ ఒక తెలివైన వ్యక్తి అని కొనియాడారు. ప్రజలకు ఆయన సేవ చేయగలడని తాను భావిస్తున్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు ఆయనకు వయస్పు మీద పడినందున ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
also read: మోడీపై 80 శాతం మందికి పాజిటివ్ కార్నర్ … పీఈడబ్ల్యూ సర్వేలో ఆసక్తికర విషయాలు…!
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇప్పటి వరకు పలు కీలక పదవులను నిర్వహించారు. ఇటీవల ఆయన మేనల్లుడు అజిత్ పవార్ ఎన్సీపీలో తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. పార్టీని రెండుగా చీల్చి ఏక్ నాథ్ షిండే- బీజేపీ సర్కార్ లో చేరారు. ప్రస్తుతం అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ గా శరద్ పవార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
also read: అమితా బచ్చన్ తో మమతా బెనర్జీ భేటీ… బిగ్ బీకి రాఖీ కట్టిన దీదీ….!
సైరస్ పూనావాలా, శరద్ పవార్ లు చాలా కాలంగా మంచి స్నేహితులు. సైరస్ పూనావాలకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పుడు ప్రపంచంలోనే వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే కంపెనీగా వుంది. ఇటీవల చంద్రయాన్-3 సక్సెస్ పై ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన ప్రశంసించారు. ఇది అంతరిక్ష రంగంలో భారత్ కు అతి పెద్ద విజయమని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
ఐశ్వర్య రాయ్ లాంటి కండ్లు కావాలంటే రోజూ చేపలు తినండి… మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు…!
మహారాష్ట్ర బీజేపీ మంత్రి(minister) విజయ్ కుమార్ గవిట్(vijay kumar gavit) వివాదాస్పద వ్యాఖ్యలు(Controversial remarks) చేశారు. చేపలు తింటే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రోజూ చేపలు తింటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కండ్ల లాగా మన కండ్లు కూడా చాలా అందంగా తయారవుతాయన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు, ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు మండి పడుతున్నాయి.
ధూలే జిల్లాలోని అంతుర్లీలో నిర్వహించిన మత్స్యకారుల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. రోజూ చేపలు తినే వారి చర్మం చాలా మృదువుగా అందంగా తయారవుతుందన్నారు. రోజు చేపలు తింటే కండ్లలో ఓ మెరుపు వస్తుందన్నారు. దీంతో మిమ్మల్ని చూసే వెంటనే మీకు అట్రాక్ట్ అయి పోతారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
మీకు ఐశ్వర్యరాయ్ గురించి చెప్పానా అని వాళ్లతో అన్నారు. ఆమె మంగళూరులో సముద్ర తీరానికి సమీపంలో నివసిస్తుందన్నారు. ఆమె రోజూ తన ఆహారంలో చేపలను క్రమం తప్పుకుండా తీసుకుంటుందన్నారు. ఆమె కండ్లను మీరు ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. రోజూ చేపలు తింటే మీ కండ్లు కూడా ఆమె కండ్ల లాగే అందంగా తయారవుతాయన్నారు.
చేపల్లో కొన్ని రకాల నూనెలు వుంటాయన్నారు. అందువల్ల చేపలు తింటే మీ శరీరం చాలా మృదువుగా తయారవుతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఇలాంటి అసంబద్ద వ్యాఖ్యులు చేయకుండా మత్స్యకారుల సమస్యలపై దృష్టి సారించాలన్నారు.
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే నితేశ్ రాణా కూడా స్పందించారు. తాను కూడా రోజు చేపలు తింటానని వెల్లడించారు. తన కండ్లు కూడా ఐశ్వర్య రాయ్ లాగా కావాల్సిందన్నారు. ఈ విషయాన్ని గవిట్ సాహెబ్ ను అడిగి తెలుసుకుంటానన్నారు. దీనిపై ఆయన ఏమైనా పరిశోధనలు చేశారో వివరాలను ఆయన్ని అడిగి తెలుసుకుంటానని చెప్పారు.