Subhansh Sukla: మే 29న స్పేస్ కు శుభాంశు శుక్లా..
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎన్ఎస్ కు వేళ్ళే ఖరారు అయింది. మే 29న శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి యాక్సియమ్-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎన్ఎస్ కు వేళ్ళే ఖరారు అయింది. మే 29న శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి యాక్సియమ్-4 మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు.
అంతరిక్ష అనుభవాలను మీడియాతో పంచుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భారత దేశం గురించి కూడా స్పందించారు. ఇండియా మహా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించారు. త్వరలోనే భారత్ కు వస్తానని తెలిపారు.
భూమి మీదకు వ్యోమగాములు సురక్షితంగా రావడంపై స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ స్పందించారు. వారి రాకపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన అధ్యక్షుడు ట్రంప్ కు థాంక్స్ చెప్పారు. పనిలో పనిగా మరోసారి బైడెన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీ ISSలో ఉన్న ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్కు లేఖ రాశారు. ఆమె అంతరిక్ష యాత్ర నుంచి తిరిగొచ్చాక ఇండియా రావాలని ఆహ్వానించారు. మార్చి 1న మెదీ సునీతా విలియమ్స్కు రాసిన లేఖను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ Xలో షేర్ చేశారు.
అంతరిక్షంలో అత్యధికంగా గడిపిన వారిలో సునీతా విలియమ్స్ ఆరో స్థానంలో ఉన్నారు. 1వ స్థానంలో ఫ్రాంక్ రూబియో 371 రోజులున్నారు. సునీతా విలియమ్స్ కంటే ఎక్కువ రోజులు ఇద్దురు మహిళలు స్పేస్లో గడిపారు. క్రిస్టినా కోచ్ 328 రోజులు, పెగ్గీ విట్సన్ 289 రోజులు ఉన్నారు.
స్పేస్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన నలుగురు ఆస్ట్రోనాట్స్ కు నాసా స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకుని వచ్చినందుకు క్రూ 9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ మొత్తం దానిలో స్పేస్ ఎక్స్ పాత్ర అధ్భుతమని నాసా కొనియాడింది.
సునీతా విలియమ్స్ మరో ముగ్గురు వ్యోమగామలతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్ 17 గంటల ప్రయాణం తర్వాత భూవాతావరణంలోకి సేఫ్ గా ల్యాండ్ అయింది. అన్ని ప్రక్రియలూ సవ్యంగా జరిగి వ్యోమగాములు సురక్షితంగా నేల మీదకు అడుగుపెట్టారు.
తొమ్మిది నెలల తర్వాత ఐఎన్ఎస్ నుంచి సునీతా విలియమ్స్ భూమి మీదకు తిరిగి వస్తున్నారు. యావత్ ప్రపంచం ఆ ఆస్ట్రోనాట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సునీతా, మిగతా వారు ఎదుర్కునే సవాళ్ళు ఏంటి? వారు భూమి మీదకు సురక్షితంగా రాగలరా..
పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అన్న దానికి నిదర్శనం ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్. భగవద్గీతే తనకు ఆదర్శమని చెప్పే ఆమె ధైర్యానికి మారు పేరు. తొమ్మిది నెలల పాటూ మానసిక స్థైర్యం కోల్పోకుండా చిరునవ్వుతో అధిగమించిన ధీర వనిత సునీతా.