/rtv/media/media_files/2025/04/30/um9NTC1oYQw8D4Xq8Yqn.jpg)
Subhansh Sukla
భారత్, అమెరికా సంయుక్తంగా చేపడుతున్న యాక్సియమ్-4 మిషన్ కార్య రూపం దాల్చనుంది. ఇందులో నలుగురు వ్యోమగాములు ఐఎన్ఎస్ కు వెళ్ళనున్నారు. వారిలో ఒకరు భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా. వీరందరూ మే 29న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళనున్నారు. భారత్కు చెందిన శుక్లాతోపాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్ , పోలాండ్ కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ , హంగరీకి చెందిన టిబర్ కపు ఐఎన్ఎస్ కు పయనమవనున్నారు. వీళ్ళందరూ అక్కడ రెండు వారాలు ఉంటారు. యాక్సియమ్ స్పేస్ కంపెనీ వీళ్ళ ద్వారా నాలుగో మిషన్ ను పంపిస్తోంది.
భారతీయుడు అంతరిక్షంలోకి..
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఐఎన్ఎస్ లో ఏడు ప్రయోగాల్లో పాల్గొంటారు. అంతరిక్షంలో పంటల సాగు, నీటి ఎగుబంట్ల గురించి అధ్యయనం చేస్తారని తెలుస్తోంది. అంతరిక్షంలోకి ఇప్పటివరకు రాకేశ్ శర్మ అన్న భారతీయడు ఒక్కరే వెళ్ళారు. కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్ వెళ్ళినా వాళ్ళు ఇండియన్ ఆరిజీన్ అమెరికన్లుగా3 గుర్తింపు పొందినవారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక భారతీయుడు స్పేస్లోకి వెళ్ళబోతున్నాడు.
ఇక అంతరిక్షంలోకి వెళుతున్న శుభాంశు శుక్లా అత్యంత పిన్న వయస్కుడు. అక్టోబర్ 10, 1985న ఉత్తరప్రదేశ్లోని లక్నోలో శుక్లా జన్మించాడు.నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్న ఇతను జూన్ 17, 2006లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరారు. తర్వాత ఫైటర్ కంబాట్ లీడర్గా అపాయింట్ అయ్యారు.ఇతనికి మొత్తం 2000 ఫ్లైట్ అవర్స్ అనుభవం ఉంది. సుఖోయ్-30MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్ మరియు An-32 వంటి విమానాలను నడిపిన అనుభవం కూడా ఉంది.
today-latest-news-in-telugu | indian | astronauts | ins | isro
Also Read: DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం