WTC: 2025-27 షెడ్యూల్ రిలీజ్.. భారత్ ఎన్ని మ్యాచ్‌లు ఆడనుందంటే!

డబ్ల్యూటీసీ తాజా షెడ్యూల్ రిలీజ్ అయింది. 2025-27కు సంబంధించిన టెస్టు మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ విడుదల చేసింది. ఈ యేడాది జూన్‌లో భారత్-ఇంగ్లాండ్‌ సిరీస్‌తో మొదలై 2027 జూన్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. టీమ్ ఇండియా మొత్తం 18 టెస్టులు ఆడనుంది.

New Update
WTC 2025-27 Schedule Release

WTC 2025-27 Schedule Release

WTC: డబ్ల్యూటీసీ తాజా షెడ్యూల్ రిలీజ్ అయింది. 2025-27కు సంబంధించిన టెస్టు మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ విడుదల చేసింది. ఈ యేడాది జూన్‌లో భారత్-ఇంగ్లాండ్‌ సిరీస్‌తో మొదలై 2027 జూన్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. టీమ్ ఇండియా మొత్తం 18 టెస్టులు ఆడనుంది. ఇక 2023-25 షెడ్యూల్ జూన్ 11న ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ పోరుతో ముగియనుంది.  

ఇంగ్లాండ్‌ పర్యటనతో మొదలు..

ఇక 2025-27లో భారత్ మొత్తం మొత్తం 18 టెస్టులు ఆడనుంది. జూన్‌లో ఇంగ్లాండ్‌ పర్యటనతో టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమవుతుంది. ఇండియాలో 9, విదేశీ గడ్డపై 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇంగ్లాండ్‌తో 5, శ్రీలంకతో 2, న్యూజిలాండ్‌తో 2, వెస్టిండీస్‌తో 2, సౌతాఫ్రికాతో 2, ఆస్ట్రేలియాతో మరోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాంగంగా 5 టెస్టులు ఆడనుంది. 

ఇది కూడా చదవండి: Navodaya: నవోదయలో దారుణం.. బాలికలపై నలుగురు టీచర్లు లైంగిక దాడి!

టీమ్‌ఇండియా షెడ్యూల్:


ఇంగ్లాండ్- భారత్: 5 టెస్టులు, జూన్-ఆగస్టు 2025
ఇండియా- వెస్టిండీస్: 2 టెస్టులు, అక్టోబర్ 2025
భారత్-సౌతాఫ్రికా: 2 టెస్టులు, నవంబర్-డిసెంబర్ 2025
శ్రీలంక- భారత్: 2 టెస్టులు, ఆగస్టు 2026
న్యూజిలాండ్‌- ఇండియా: 2 టెస్టులు, అక్టోబర్-డిసెంబర్ 2026
భారత్- ఆస్ట్రేలియా: 5 టెస్టులు, జనవరి-ఫిబ్రవరి 2027 (బోర్డర్-గావస్కర్ ట్రోఫీ)

ఇది కూడా చదవండి: Atishi: కన్నీళ్లు పెట్టుకున్న సీఎం అతిషి.. వీడియో వైరల్

rdr

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు