/rtv/media/media_files/2025/05/12/voo23LkgE8VC2uRJ3taU.jpg)
kohli-and-dhoni
టెస్టులకు స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్కు ముగింపుపలుకుతున్నట్లు స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. 14 ఏళ్ల పాటు టెస్టుల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నాడు కోహ్లీ. ఇప్పటికే టీ20లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ కేవలం ఐపీఎల్, వన్డేలలో మాత్రమే కొనసాగనున్నాడు. ఇండియన్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా ఎదిగిన కోహ్లీ తన టెస్టు క్రికెట్ లో సాధించిన విజయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
2011 మధ్యలో టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టాడు కోహ్లీ. జమైకాలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు123 టెస్టులు ఆడిన కోహ్లీ.. 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 7 డబుల్ సెంచరీలున్నాయి. టెస్టు ఫార్మాట్లో విరాట్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 254 పరుగులు. ఇక కోహ్లీ తన చివరి టెస్టు మ్యాచ్ 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో ఆడాడు.
68 టెస్టులకు కెప్టెన్ గా
ధోనీ నుంచి 2014లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కోహ్లీ భారత్ తరుపున 68 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో 40 మ్యాచ్ లలో భారత్ విజయం సాధించగా.. మరో 17 మ్యాచ్ల్లో భారత్ ఓడిపోయింది. 11 మ్యాచ్లు డ్రా అయ్యాయి. కెప్టెన్ గా కోహ్లీ విజయశాతం 58.82గా ఉంది. ఎంఎస్ ధోని 60 మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించగా అందులో 27 విజయాలున్నాయి.. ఇక సౌరవ్ గంగూలీ – 49 మ్యాచ్ల్లో కెప్టెన్ గా వ్యవహరించగా అందులో 21 విజయాలున్నాయి.
టెస్టుల్లో అత్యుత్తమమైన కెప్టెన్ లలో కోహ్లీ ఒకరు. గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41)లు మాత్రమే కెప్టెన్లుగా కోహ్లీ కంటే ఎక్కువ విజయాలు అందుకున్నారు.
Also read : Virat Kohli Records : కోహ్లీ రేర్ రికార్డ్స్.. బద్దలుకొట్టే మగాడు మళ్లీ పుడతాడా?