/rtv/media/media_files/2025/06/03/skGL5OrQocrvg80rdDvu.jpg)
ఈరోజు జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్స్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చాలా ముఖ్యమైన మ్యాచ్. ఈ సారి కప్ కొట్టడం అతనికి చాలా ఇంపార్టెంట్. ఆర్సీబీకి కూడా ఇది పద్ధెనిమిదేళ్ళ కల. ఈ సారి ఛాంపియన్ ఎలా అవ్వాలని పట్టుదలగా ఉంది. ఇలాంటి మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటింగ్ ఓకేఓకే గా చేసింది. విరాట్ కోహ్లీ మాత్రమే 43 పరుగులు చేశారు. మిగతా వారు అందరూ 30 పరుగులు దాటలేదు. విరాట్ పై మాజీలు అసంతృప్తి.. ఈరోజు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్. కానీ మాజీలు మాత్రం అతని ఆటపై పసెదవి విరుస్తున్నారు. కీలక మ్యాచ్ లో విరాట్ ఆడాల్సిన ఇన్నింగ్స్ కాదని అంటున్నారు. 43 పరుగులు చేయడానికి 35 బంతులు తినేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక స్టార్ ఆటగాడు, సీనియర్ ఇలా బ్యాటింగ్ చేయకూడదంటూ విమర్శిస్తున్నారు. కోహ్లీ తన ఆట ఆడి ఉంటే అతనికి మరిన్ని పరుగులు వచ్చేవని..ఆర్సీబీ స్కోర్ కూడా ఇంకా ఎక్కువ ఉండేదని అంటున్నారు. పీబీకేఎస్ బౌలర్లు పక్కా ప్లాన్ తోనే కోహ్లీకి షార్ట్, అండ్ స్లో బంతులు విసిరారని మాజీ క్రికెట్ర్ ఇర్ఫాన్ అన్నాడు. అహ్మదాబాద్ లాంటి పిచ్ పై 35 బంతులు ఆడాక కూడా 123 స్ట్రైక్ రేట్ నిరాశపర్చిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.