/rtv/media/media_files/2025/02/22/BqCCIMP4QGbSR2S7VCC8.jpg)
ind vs pak Photograph: (ind vs pak)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ ట్రోపీలో పక్ సెీస్ ఆశలు గల్లంతవ్వగా...టీమ్ ఇండియా మాత్రం తన బెర్తును ఖాయం చేసుకుంది. మొత్తం మ్యాచ్ ను అంతటినీ విరాట్ కోహ్లీ ఒక్కడే తన ఒంటి చేత్తో నడిపించేశాడు. కీలక తరుణంలో కింగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. టీ20 సీరీస్ తరవాత విరాట్ పెద్దగా ఆడిన ధాఖలాలు లేదు. కానీ ఈమ్యాచ్ లో మాత్రం విజృంభించేశాడు.
ఇక పాక్ వెర్సస్ భారత్ మ్యాచ్ ల విషయానికి వస్తే... ఈ రెండు దేశాల మధ్యనా మ్యాచ్ అంటే ఎప్పుడూ క్రేజే. కేవలం భారత్, పాక్ లే కాకుండా యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తుంది. దీన్నో దాయాది సమరం అంటారు. క్రికెట్ మ్యాచ్ ను రెండు దేశాల మధ్యా యుద్ధంగా భావిస్తారు. ఇలాంటి మ్యాచ్ లు ఎప్పుడూ భారత్ కు సవాళ్ళుగా నిలుస్తాయి. ఇందులో గెలవడం ప్రెసటీజియస్ గా భావిస్తాయి రెండు టీమ్ లూ.
ఛాంపియన్స్ ట్రోఫీలో ముదున్న పాక్..
మిగతా టోర్నీలు, సీరీస్ ల సంగతి ఎలా ఉన్నా ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఇప్పటి వరకూ భారత్ కన్నా పాక్ ముందుంది. మొత్తం టోన్నీ చరిత్రలో రెండు దేశాల మధ్యనా ఐదు మ్యాచ్ లు జరిగితే అందులో పాక్ 3 గెలవగా...టీమ్ ఇండియా రెండు మాత్రమే గెలిచింది. ఈరోజు ఆరో మ్యాచ్ లో ఆ విజయాలను భారతజట్టు సమం చేసింది.
2004 (ఎడ్జ్బాస్టన్):
మొట్టమొదటిసారి ఇక్కడ తల పడ్డగాయి భారత్ , పాకిస్తాన్ లు. ఇందులో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ 49.5 ఓవర్లలో 200 పరుగులు చేయగా.. పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2009 (సెంచూరియన్):
ఇందులో కూడా పాకిస్తాన్ 54 పరుగుల తేడాతో గెలిచింది. 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ మ్యాచ్ కోసం సెప్టెంబర్ 26న సెంచూరియన్లోని సూపర్స్పోర్ట్ పార్క్లో ఈ రెండు జట్లు తలపడ్డాయి. పాకిస్తాన్ 50 ఓవర్లలో 302/9 పరుగులు చేయగా భారత్ ఆ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
2013 (ఎడ్జ్బాస్టన్):
భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈసారి భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో వాతావరణ మార్పుల కారణంగా, మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ 39.4 ఓవర్లలో 165 పరుగులు చేయగలిగింది. మళ్ళీ వర్షం వచ్చింది. ఫలితంగా, భారత ఇన్నింగ్స్ను అదనంగా 22 ఓవర్లకు కుదించారు.102 పరుగుల సవరించిన లక్ష్యంతో. 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, డిఎల్ఎస్ పద్ధతి ద్వారా పాకిస్తాన్పై భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ లో తొలి విజయాన్ని సాధించింది.
2017 (ఎడ్జ్బాస్టన్):
భారత్ 124 పరుగుల తేడాతో పాక్ ను ఓడించింది. మొదట టీమ్ ఇండియా బ్యాటింగ్ చేసింది. భారత్ ఇన్నింగ్స్లో మ్యాచ్ను 48 ఓవర్లకు తగ్గించారు. దీంతో భారత్ 319/3 స్కోరు చేసింది. పాకిస్తాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా సవరించగా, పాకిస్తాన్ 33.4 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసి ఓటమి పాలయ్యింది.
2017 (ఓవల్):
పాకిస్తాన్ 180 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో భారత్ పాకిస్తాన్ను రెండో సారి ఎదుర్కొంది. ఫఖర్ జమాన్ చేసిన అద్భుతమైన తొలి వన్డే సెంచరీతో పాకిస్తాన్ 50 ఓవర్లలో 389 పరుగుల లక్ష్యాన్ని భారత్ కు ఇచ్చింది. అయితే పరుగుల ఛేదనలో తడబడిన టీమ్ ఇండియా 30.3 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఈ ఫైనల్స్లో భారత్ పై విజయంతో పాకిస్తాన్కు తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
2025(దుబాయ్)..
2017 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని మళ్ళీ ఇప్పుడే నిర్వహిస్తున్నారు. అప్పుడు ఫైనల్స్ లో ఫాక్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత జట్టు ఆ ప్రతీకారాన్ని ఎలా అయినా మళ్ళీ తీర్చుకోవాలని అప్పటి నుంచి పట్టుదలగా ఉంది. ఈరోజు మ్యాచ్ గెలిచి దాన్ని తీర్చుకుంది. అంతేకాదు ఇప్పటివరకు విజయాల్లో పైచేయిగా పాక్ ఉంటూ వచ్చింది. ఈ రోజు మ్యాచ్ గెలుపుతో దాన్ని కూడా సమయం చేసింది టీమ్ ఇండియా.
Also Read: Virat Kohli: అన్ బీటబుల్ విరాట్..కింగ్ ఆఫ్ క్రికెట్