/rtv/media/media_files/2025/06/02/82GWcZtcW00Csba1s6Ln.jpg)
పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన ఐపీఎల్ 2025 రెండవ క్వాలిఫయర్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ లోకి దూసుకెళ్లింది. 2014లో ఐపీఎల్ ఫైనల్కు చేరుకున్న పంజాబ్ మరోసారి ఫైనల్ కు చేరుకుని ఈ సారి బెంగళూరు జట్టును ఢీకొట్టనుంది.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్కు మూడు వేర్వేరు జట్లను నడిపించిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. 2018 ఎడిషన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అయ్యర్, 2020 ఎడిషన్లో ఆ జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. అప్పుడు ఆ జట్టు రన్నరప్గా నిలిచింది. ఐపీఎల్ 2022, 2024లో కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్గా వ్యవహరించిన అయ్యర్., గతేడాది ఆ జట్టును ఫైనల్ కు తీసుకెళ్లి తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకున్నాడు.
పంజాబ్ ను IPL 2025 ఫైనల్కు తీసుకువెళ్లడం ద్వారా, అయ్యర్, ధోని, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా తర్వాత వరుసగా ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన నాల్గవ కెప్టెన్గా. రెండు వేర్వేరు జట్లతో వరుసగా ఫైనల్స్ ఆడిన మొదటి కెప్టెన్గా కూడా అయ్యర్ నిలిచాడు.
Also Read : దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత
Also Read : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
వరుసగా ఐపీఎల్ ఫైనల్స్ ఆడనున్న కెప్టెన్లు
ఎంఎస్ ధోని - చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011, 2012, 2013), (2018, 2019)
రోహిత్ శర్మ - ముంబై ఇండియన్స్ (2019 2020)
హార్దిక్ పాండ్యా - గుజరాత్ టైటాన్స్ (2022 2023)
శ్రేయాస్ అయ్యర్ - కోల్కతా నైట్ రైడర్స్ (2024), పంజాబ్ కింగ్స్ (2025)
Also Read : ఏపీలో పవిత్రతకు విఘాతం.. గంగమ్మ జాతరలో యువకుల ఆకతాయి చేష్టలు
కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ రికార్డు
2019: ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేఆఫ్స్)
2020: ఢిల్లీ క్యాపిటల్స్ (ఫైనల్)
2022: కోల్కతా నైట్ రైడర్స్ (7వ)
2024: కోల్కతా నైట్ రైడర్స్ (ఛాంపియన్)
2025: పంజాబ్ కింగ్స్ (ఫైనల్*)
Also Read : ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు
sports | shreyas-iyer | RCB vs PBKS