/rtv/media/media_files/2025/03/05/QtmMuEkyqF0cap7ln5pt.jpg)
New Zealand won the toss and elected to bat.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు దక్షిణాఫ్రికా vs న్యూజిలాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. దీంతో సౌతాఫ్రికా ముందు ఇది అతి పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. 363 పరుగులు ఛేదిస్తే సౌతాఫ్రికా ఫైనల్కు చేరుకుంటుంది. లేదంటే న్యూజిలాండ్ వెళ్తుంది.
Also Read : చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది?
టాస్ గెలిచి బ్యాటింగ్
ఈ మ్యాచ్లో మొదట న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అదే సమయంలో సౌతాఫ్రికా జట్టు బౌలింగ్ ఎటాక్ మొదలు పెట్టింది. ఓపెనర్లుగా విల్ యంగ్, రచిన్ రవీంద్ర క్రీజ్లోకి వచ్చారు. మెల్లి మెల్లిగా ఫామ్ను కనబరుస్తూ పరుగులు రాబట్టారు. ఫైనల్కు ఎలాగైనా పోవాలనే దృఢ సంకల్పంతో ఆచితూచి ఆడారు.
Also Read : మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అదే సమయంలో న్యూజిలాండ్ కేవలం 48 పరుగులకే ఒక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ విల్ యంగ్ (21) పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కేన్ విలియమ్సన్ నిలకడగా ఆడాడు. ఇక ఈ ఇద్దరు బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. అందులో రచిన్ రవీంద్ర అద్భుతంగా ఆడాడు. 47 బంతుల్లో అర్థశతకం నమోదు చేశాడు.
Also Read : ఇంద్రా బస్సు బోల్తా.. స్పాట్లో 12 మంది..
అదే సమయంలో కేన్ విలియమ్సన్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఆడి మంచి స్కోర్ రాబట్టారు. సౌతాఫ్రికా బౌలర్లకు చెమటలు పట్టించారు. అనంతరం రచిన్ రవీంద్ర దూకుడు పెంచాడు. చెలరేగి ఆడుతూ అదరగొట్టేశాడు. 93 బంతుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించాడు. అందులో 13, 1 సిక్స్తో విజృంభించాడు. అనంతరం విలియమ్సన్ కూడా సెంచరీ చేసి ప్రశంసలు అందుకున్నాడు.
Also Read : అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
ఇలా మొత్తంగా న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు నిర్ధేశించింది. దీంతో సౌతాఫ్రికాకు ఇది పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. న్యూజిలాండ్ నిర్ధేశించిన పరుగులు ఛేదిస్తే.. భారత్తో ఫైనల్కు చేరుకోవచ్చు.. లేదంటే భారత్తో తలపడే జట్టు న్యూజిలాండ్ అవుతుంది.