/rtv/media/media_files/2025/04/27/pqHxOZA3Tfu3h8LgLz4H.jpg)
RCB VS DC
విరాట్ కోహ్లీ మళ్ళీ గర్జించాడు. యంగ్ స్లేయర్ కృనాల్ విజృంభించాడు. దీంతో ఢిల్లీ చేతులెత్తేసింది. ఈరోజు ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ అద్బుత విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. దీంతో 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కాస్త టెన్షన్ పెట్టింది. కానీ ఓపెనర్ గా వచ్చిన కింగ్ కోహ్లీ నిలకడగా ఆడుతూ జట్టును నిలబెట్టాడు. అలాగే నాలుగు స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కృనాల్ విజృంభించేశాడు. దీంతో మ్యాచ్ ఆర్సీబీ వశమైంది. కృనాల్ పాండ్య (73*), విరాట్ కోహ్లీ (51) అర్ధశతకాలతో చెలరేగారు. దీంతో వరుసగా మూడు మ్యాచ్ లను గెలిచిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్ళింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. ఆర్సీబీకి ఇది ఏడో విజయం.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని..
ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టు ఓపెనర్లు మంచి ఫామ్ అందించారు. అభిషేక్ పోరెల్, డుప్లెసిస్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఓపెనర్ అభిషేక్ పోరెల్ క్రీజులో ఎక్కువ సమయం నిలబడలేకపోయాడు. జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో పోరెల్ (28) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన కరుణ్ నాయర్ మరుసటి ఓవర్లోనే పెవిలియన్కు చేరాడు. నాయర్ (4) ఔట్ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు సాధించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, డుప్లెసిస్ మెల్లి మెల్లిగా పరుగులు రాబట్టారు. ఆచితూచి ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. డుప్లెసిస్ (22) ఔట్ అయ్యాడు. కృనాల్ పాండ్య వేసిన 9.5 ఓవర్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ జట్టు 10 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 72 పరుగులు మాత్రమే చేసింది. గత మ్యాచ్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ స్కోర్ అనే చెప్పాలి. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 162 పరుగులు సాధించింది.
today-latest-news-in-telugu | IPL 2025 | dc vs rcb | match
Also Read: India: పాకిస్తానీయులకు ముగిసిన డెడ్ లైన్..537 మంది వెనక్కు..