IPL 2025: రాజస్థాన్ రాయల్స్ బంపర్ విక్టరీ.. చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల కుర్రాడు

గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బంపర్ విక్టరీ సాధించింది. 8 వికెట్ల తేడాతో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయసంగా చేరుకుంది. వైభవ్ సూర్యవంశీ (101) పరుగులతో చెలరేగిపోయాడు.

New Update
Rajastan Royals Won

Rajastan Royals Won


గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బంపర్ విక్టరీ సాధించింది. 8 వికెట్ల తేడాతో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయసంగా చేరుకుంది. వైభవ్ సూర్యవంశీ (101) పరుగులతో చెలరేగిపోయాడు. యశస్వి జైశ్వల్ సైతం 70 పరుగులు చేశాడు. ఒపెనర్ల ఊచకోతతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. చివర్లో కెప్టెన్ పరాగ్ సైతం బౌండరీలు బాదాడు. 

Also Read: ఇది మీ చేతగాని తనం.. ఇండియన్ ఆర్మీపై షాహిద్ అఫ్రిది సంచలన కామెంట్స్!

చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ 

రాజస్థాన్ టీమ్ ఒపెనర్ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. సిక్సులు, ఫోర్లతో ఫీల్టర్స్‌ను బౌండరీలకు పరిగెత్తించాడు. కేవలం 35 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. గతంలో క్రిస్‌గేల్‌ 30 బంతుల్లో సెంచరీ చేయగా.. రెండో స్థానాన్ని వైభవ్ భర్తీ చేశాడు. అలాగే అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్‌గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 10వ ఓవర్లో ఏకంగా 3 సిక్సులు, 4 ఫోర్లతో చితకబాదాడు. 35 బంతుల్లో సెంచరీ చేయగా ఇందులో 11 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. 14 ఏళ్ల కుర్రాడు ఇలా తక్కువ బంతుల్లో సెంచరీ చేయడంతో సోషల్ మీడియాలో వైభవ్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

telugu-news | rtv-news | gujarat-titans | Rajastan Royals

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు