/rtv/media/media_files/2025/05/07/OLdpgXWLlhBCrXUJNjV2.jpg)
MI VS GT
ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబయ్ ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మంచి మ్యాచ్ జరిగింది. ఇందులో గుజరాత్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబయ్ ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ మొదటి నుంచి దూకుడుగా ఆడింది. దానికి తోడు మధ్యలో వర్షం కూడా పడింది. దీంతో డక్ వర్త లూయిస్ ప్రకారం గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి విజయం సాధించింది. ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, బుమ్రా, అశ్విని కుమార్ తలో రెండు వికెట్లు తీయగా, చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్ కు వెళ్ళింది. 11 మ్యాచ్ లలో 8 గుజరాత్ టైటాన్స్ 8 గెలిచింది.
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 156 టార్గెట్ ఉంది. ముంబై బ్యాటర్లలో విల్ జాక్స్ 53 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 35 పరుగులు రాణించారు. మిగతావారు తక్కువ పరుగులకే చేతులెత్తేశారు.
ఎవరెన్ని కొట్టారంటే?
రికిల్టన్ 2 బంతుల్లో 2 పరుగులు, రోహిత్ శర్మ 8 బంతుల్లో 7 పరుగులు, తిలక్ వర్మ 7 బంతుల్లో 7 పరుగులు, హార్థిక్ పాండ్యా 3 బంతుల్లో 1 పరుగు, నమన్ ధీర్ 10 బంతుల్లో 7 పరుగులు, కోర్బిన్ బాష్ 22 బంతుల్లో 27 పరుగులు, చాహర్ 8 బంతుల్లో 8 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. శర్మ 1 బంతికి ఒక్కటే పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ ఒక్కో వికెట్ పడగొట్టారు.
today-latest-news-in-telugu | IPL 2025 | GT vs MI | match