/rtv/media/media_files/2025/06/01/9oiFF8VqMDehy4Q9ZgKe.jpg)
MI VS PBKS
ఐపీఎల్ లో ఫైనల్స్ లో ఆర్సీబీతో తలపడనున్న జట్టేదో ఈరోజు తేలిపోతుంది. ఈరోజు క్వాలిఫయర్ 2 లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతోంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం దీనికి అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ రద్దయితే రెండు జట్లకూ చెరో పాయింట్ ఇస్తారు. దీని వలన పంజాబ్ ఫైనల్స్ కు వెళుతుంది. ముంబై ఇండియన్స్ ఇంటికి వెళిపోతుంది. టాప్ 4 రేస్ లో పంజాబ్ మొదటి స్థానంలో ఉండడమే ఇందుకు కారణం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..
వర్షం తర్వాత ఆలస్యంగా కొద్దిసేపటి క్రితమే మ్యాచ్ ప్రారంభం అయింది. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ మొదలు పెట్టిన ముంబై దూకుడుగా ఆడుతోంది. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ ఈ మ్యాచ్ లో మాత్రం 8 పరుగులే చేశాడు. స్టాయినిస్ వేసిన 2.2వ బంతిని డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా భారీ షాట్ ఆడిన రోహిత్ బంతిని బౌండరీ లైన్ దగ్గర విజయ్ కుమార్ అందుకున్నాడు. ఇతని తర్వాత తిలక్ వర్మ బ్యాటింగ్ కు దిగాడు. ప్రస్తుతం బెయిర్ స్టో 20, తిలక్ వర్మ 11 బ్యాటింగ్ చేస్తున్నారు.