/rtv/media/media_files/2025/06/05/6VlE0JEYpBxeLzjNhwgt.jpg)
Overcrowding, free passes among causes of RCB celebration stampede, sources
ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని సాధించిన ఆనందం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ వేడుక విషాదంగా మారింది. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పలు కారణాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండి..
— RTV (@RTVnewsnetwork) June 4, 2025
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్లో అప్డేట్చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ… pic.twitter.com/ImFUCn2AfR
ఉచిత పాస్ల ప్రచారం
చిన్నస్వామి స్డేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల కోసం బుధవారం సాయంత్రం ఏకంగా 3 లక్షల మంది క్రికెట్ ఫ్యాన్స్ వచ్చారు. కానీ ఆ స్టేడియం సామర్థ్యం కేవలం 35 వేల మంది మాత్రమే. ఆ స్టేడియంలో మొత్తం 21 స్టాండ్లు, అలాగే 13 గేట్లు ఉన్నాయి. అయితే వీటిలో 9,10వ నంబర్ గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు. ఇక 5,6,7 గేట్ల నుంచి మాత్రమే అభిమానులను లోపలికి అనుమతించారు. అయితే 7వ నంబర్ నుంచి చూస్తే స్టేడియం ప్రధాన ప్రవేశం నుంచి లోపలి దృశ్యం కనిపిస్తోంది. మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఆర్సీబీ టీం గ్రౌండ్లోకి వస్తుంది కాబట్టి.. 7వ నంబర్ గేట్ వద్దకు భారీగా అభిమానులు పోటెత్తారు.
వాస్తవానికి అక్కడ పాస్లు ఉన్నవారికి మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ చాలామంది పాస్లు లేకుండా అక్కడికి పోటెత్తారు. ఇక ఏడో నంబర్ గేట్ వద్ద ఫ్రీగా టికెట్లు ఇస్తున్నారంటూ ప్రచారం చేశారు. దీంతో అభిమానులు భారీ ఎత్తున అటువైపు పరిగెత్తారు. టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడం వల్ల తొక్కిసలాట జరిగిందని అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ 7వ నంబర్ గేట్ వద్దే ఎక్కువగా తొక్కిసలాట జరిగింది.
విరిగిపోయిన గేట్లు
స్టేడియం వద్ద క్రికెట్ ఫ్యాన్స్ను కంట్రోల్ చేసేందుకు దాదాపు 5 వేల మంది పోలీసులు మోహరించారు. కానీ అంచనాలకు మించి అభిమానులు పొటెత్తడంతో వాళ్లని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. గేట్లు చిన్నగా ఉండటంతో అభిమానులు లోపలికి సులభంగా వెళ్లలేకపోయారు. ఆ గేట్లు చిన్నగా ఉండటంతో అవి విరిగిపోయాయని రద్దీ ఎక్కువ కావడంతో ఈ ఘటన సంభవించిందని భావిస్తున్నామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. అయితే పాస్లు ఉన్నాకూడా మమ్మల్ని లోపలకి రానీయలేదని కొందరు అభిమానులు చెబుతున్నారు.
మరోవైపు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విధానసౌధ(అసెంబ్లీ) నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడ్ ఉంటుందని ఆర్సీబీ టీమ్ నిన్న ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు భారీగా వస్తారని అంచనా వేసిన పోలీసులు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం స్డేడియంలో సన్మాన కార్యక్రమానికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ మరో ప్రకటన విడుదల చేసింది. పరేడ్ను నిర్వహిస్తామని కానీ అభిమానులు గైడ్లైన్స్ను పాటించాలని చెప్పింది. దీంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. పరేడ్ ఎటువైపు ఉంటుందో తెలియక.. చాలామంది స్టేడియం లోపలికి వెళ్లేందుకే ఆసక్తి చూపారు. కొందరు పాస్లు లేకుండానే గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వాళ్లని అడ్డుకున్న పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలోనే పరిస్థితులు ఉద్రిక్తంగా మారినట్లు సాక్షులు తెలిపారు.
telugu-news | rtv-news | Bengaluru Stampede | chinnaswamy stadium stampede | rcb