/rtv/media/media_files/2025/04/06/jnTwF87gfKjAEdGOneTU.jpg)
Dhoni IPL retirement
ఒకటి, రెండు ప్రాబ్లెమ్స్ అయితే సరిదిద్దుకోవచ్చును. చిన్న ప్లేయర్లు అయితే నేర్పించవచ్చును. కానీ ఆటగాళ్ళు పెద్ద వాళ్ళు అయి ఉండి...ఎక్కువ మంది ఆడకపోతే ఏం చేయగలము అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తల కొట్టుకుంటున్నాడు. చెన్నై ఇప్పటికే తొమ్మిది మ్యాచ్ల్లో 19 మంది ఆటగాళ్లను ఆడించింది. రకరకాల కాంబినేషన్స్ కూడా ట్రై చేశాను. ఇంత చేసినా ఎవరూ ఆడలేదు. ఉన్నవాళ్ళందరూ ఆడకపోతే ఎక్కువ మార్పులు చేయాల్సి వచ్చిందని ధోనీ చెప్పాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను బ్యాటర్లు ప్రతీసారి అటాక్ చేయలేకపోయారు. ఎంత చెప్పినా ఆడలేదు. మా ఓటమికి ప్రధాన కరణాల్లో అది కూడా ఒకటని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఇప్పటివరకు అతి చెత్త ప్రదర్శన..
ఐపీఎల్ 18 సీజన్ లో చెన్నై అతి పేలవమైన ప్రదర్శన చేసింది. మొత్తం తొమ్మిది మ్యాచ్ లు ఆడింది. అందులో కేవలం రెండు మాత్రమే గెలిచింది. చాలా కీలకమైన మ్యాచ్ లలో చెత్త ప్రదర్శన ఇచ్చింది. కనీసం రన్ రేట్ ను కూడా మెయింటెయిన్ చేయలేకపోయింది. కెప్టెన్ మార్చారు, ప్లేయర్లను మర్చారు కానీ ఫలితం లేకపోయింది. ప్రతీ మ్యాచ్ లోనూ బ్యాటర్లు చేతులెత్తేశారు. నిజానికి కెప్టెన్ ధోనీ కూడా పెద్దగా ఆడింది లేదు. కానీ చెన్నై జట్టుకు మళ్ళీ కెప్టెన్ బాధ్యతలు తీసుకున్నాక కాస్త బాగానే ఆడాడు. చివర్లో వచ్చినా మెరుపులు మెరిపించడంలో సఫలం అయ్యాడు. కానీ అతని కన్నా ముందు ఎవరూ సరిగ్గా ఆడకపోవడంతో మ్యాచ్ లు ఓడిపోయారు.
today-latest-news-in-telugu | csk | IPL 2025 | mahendra-singh-dhoni
Also Read: UP: పహల్గాం దాడికి వ్యతిరేకంగా వ్యక్తి హత్య..2600 మందిని చంపుతామంటూ వీడియో