Joginder Sharma: 12 ఏళ్ల తర్వాత కలిసిన వరల్డ్ కప్ హీరోస్.. పోస్ట్ వైరల్!
2007 ఫస్ట్ టీ20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మహేంద్ర సింగ్ ధోని, జోగిందర్ శర్మ 12 ఏళ్ల తర్వాత ఒకచోట కలిశారు. చాలాకాలం తర్వాత ధోనీని కలిశా. నిజంగా ఇది సరికొత్త అనుభూతి అంటూ జోగిందర్ వీడియో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.