World Athletics Championship 2025: నీరజ్ చోప్రాకు నిరాశే.. ఏడేళ్లలో మొదటిసారి ఓటమి

టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. గత ఏడేళ్లలో తొలిసారిగా ఆయన ఓ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో ఖాళీ చేతులతో వెనుతిరిగాడు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా ఓడిపోయి 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

New Update
javelin throw

టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు చేదు అనుభవం ఎదురైంది. గత ఏడేళ్లలో తొలిసారిగా ఆయన ఓ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో ఖాళీ చేతులతో వెనుతిరిగాడు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా ఓడిపోయి 8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

గత రాత్రి జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ 84.03 మీటర్లు మాత్రమే జావెలిన్ త్రో విసరగలిగాడు. ప్రపంచ ఛాంపియన్‌గా తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని ఆశించిన నీరజ్‌కు ఈ ఫలితం నిరాశ కలిగించింది. ఈ టోర్నీలో అతని వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 90.23 మీటర్లు. అతను 85 మీటర్ల మార్కును ఒక్కసారి కూడా దాటలేకపోవడం గమనార్హం. ఫైనల్స్‌లో అతని ఐదవ ప్రయత్నం ఫౌల్ కావడంతో, నీరజ్ పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఈ పోటీలో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషార్న్ వాల్కాట్ 88.16 మీటర్ల త్రోతో బంగారు పతకం సాధించాడు. భారత అథ్లెట్ సచిన్ యాదవ్ 86.27 మీటర్ల త్రోతో 4వ స్థానంలో నిలిచి ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో నీరజ్‌తో పాటు అందరి దృష్టినీ ఆకర్షించిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ కూడా నిరాశపరిచాడు. అతను 10వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

Advertisment
తాజా కథనాలు