/rtv/media/media_files/2025/05/01/7jCujSf8tqzNfTBOjdlc.jpg)
icc women's t20 world cup 2026
2026 మహిళల టీ20 వరల్డ్ కప్ ఇంగ్లండ్ వేదికగా జగరనుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ టోర్నీ వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. మొత్తం ఏడు వేదికల్లో ఈ మెగా టోర్నమెంట్ జరగనున్నట్లు ఐసీసీ తన అఫీషియల్ సైట్ ద్వారా ఇవాళ తెలిపింది. ఈ టోర్నమెంట్ను ఎడ్జ్బాస్టన్, హాంప్షైర్ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ మ్యాచ్లను నిర్వహిస్తాయని ఐసీసీ వెల్లడించింది.
Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ!
📍 7 venues. One unmissable tournament 🏆
— ICC (@ICC) May 1, 2025
The ICC Women’s T20 World Cup 2026 will grace some of England’s most iconic grounds 🤩
✍️: https://t.co/BqtN44SMEX pic.twitter.com/UmkuBU4HL3
📍 7 venues. One unmissable tournament 🏆
— T20 World Cup (@T20WorldCup) May 1, 2025
The ICC Women’s T20 World Cup 2026 will grace some of England’s most iconic grounds 🤩
✍️: https://t.co/Li8gF1nUek pic.twitter.com/2gPxePX6HW
Also Read: పహల్గామ్ ఉగ్రదాడిపై సుప్రీం కోర్టులో పిటిషన్.. కీలక నిర్ణయం!
జూన్ 12న ప్రారంభం
కాగా ఈ మహిళల టీ20 ప్రపంచ కప్ వచ్చే ఏడాది అంటే 2026 జూన్ 12న ప్రారంభం కాబోతుంది. మొత్తం 24 రోజుల పాటు ఈ టోర్నీ జరగనుంది. ఇందులో 33 మ్యాచ్లు జరగుతాయి. జూలై 5న ఈ మెగా ఈవెంట్ ఫైనల్ చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినట్లు ఐసీసీ తెలిపింది. ఈ టోర్నమెంట్ షెడ్యూల్కు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఐసీసీ చెప్పుకొచ్చింది.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
🚨 2026 Women's T20WC Update 🚨
— CricketGully (@thecricketgully) May 1, 2025
🔹 Host - England
🔹 Final - Lord's
🔹 Venues - Lord's, Edgbaston, Hampshire Bowl, Headingley, Old Trafford, The Oval and Bristol
🔹 Begins on 12th June, 2026 with 33 Matches
🔹 12 Teams into 2 Groups of 6 Teams
📷 ICC via Getty Images pic.twitter.com/HPU3uyAQGe
Also Read: ఇజ్రాయెల్లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
కాగా ఈ మెగా టోర్నీ టైటిల్ కోసం దాదాపు 12 టీంలు పోటీ పడనున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మ్యాచ్లు హోరా హోరీగా సాగనున్నట్లు తెలుస్తోంది. తొలి గ్రూప్ దశలో 12 జట్లను 6 టీమ్లతో రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఆ తర్వాత నాకౌట్ రౌండ్లు, ఫైనల్స్ జరుగుతాయి. ఇప్పటికే ఐసీసీ మహిళా టీ 20 వరల్డ్ కప్కు ఆతిథ్య ఇంగ్లాండ్ తో పాటు ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు అర్హత సాధించాయి. 2026 లో జరగనున్న క్వాలిఫయర్ మ్యాచ్ల ద్వారా మరో 4 టీమ్లను సెలెక్ట్ చేయనున్నారు.
sports-news | latest sports News | sports news in telugu latest sports News