BIG BREAKING: కోహ్లీపై తొలి ఫిర్యాదు.. అరెస్ట్ అయ్యే ఛాన్స్!?

బెంగళూర్ తొక్కిసలాట ఘటనలో RCB ప్లేయర్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు ప్రధాన కారణం విరాట్ అంటూ రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు.

New Update
Complaint against Virat Kohli over Bengaluru stampede

Complaint against Virat Kohli over Bengaluru stampede

స్టార్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఇవాళ (శుక్రవారం) కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేష్ ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సమీపంలోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఆయన కంప్లైంట్ చేశారు. 

Also Read :  వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు

కోహ్లీ ప్రధాన కారణం

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీ ప్రధాన కారణం అంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అతడి ఫిర్యాదుపై స్పందించిన కబ్బన్ పార్క్ పోలీసులు.. ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసు కింద పరిగణనలోకి తీసుకుంటామని, తొక్కిసలాట సంఘటనపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

Arrest Kohli Hashtag

మరోవైపు విరాట్ కోహ్లీపై సోషల్‌మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఆర్సీబీ యాజమాన్యంపై మండిపడుతున్నారు. విరాట్‌ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎక్స్‌లో అరెస్ట్‌ కోహ్లీ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌(Arrest Kohli Hashtag Trending on Twitter) అవుతోంది. కొహ్లీని అరెస్టు చేయాలని పలువురు నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.

RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కోహ్లీ లండన్‌కు వెళ్లిపోయాడని.. కనీసం బాధిత కుటుంబాలను కూడా పరామర్శించలేదని విమర్శిస్తున్నారు. మ్యాచ్‌ గెలిచినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న కొహ్లీ.. క్రికెట్ అభిమానులు తొక్కిసలాటలో చనిపోతే పశ్చాత్తాపం చూపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొహ్లీకి సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తూ మండిపడుతున్నారు.

Also Read: భారత్‌లో 3000 మంది పాక్ స్పైలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు