Champions Trophy: మూడు ఓవర్లలో నాలుగు పరుగులు, ఒక వికెట్.. ఆసీస్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్

ఛాంపియన్స్ ట్రోపీ సెమీ ఫైనల్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు భారత్ జట్టు చుక్కలు చూపిస్తుంది. మూడు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆస్ట్రేలియా తమ తొలి వికెట్‌ను కూడా కోల్పోయింది. 

New Update
Champions Trophy Live Updates

Champions Trophy Live Updates

ఛాంపియన్స్ ట్రోపీ సెమీ ఫైనల్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు భారత్ జట్టు చుక్కలు చూపిస్తుంది. మూడు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ  మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తమ తొలి వికెట్‌ను కోల్పోయింది. ఓపెనర్ కూపర్ కొన్నెల్లీ డకౌట్ అయ్యాడు.

భారత్ జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, షమీ, కుల్‌దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి టీమ్‌లో ఉన్నారు. 

ఆస్ట్రేలియా జట్టు

కూపర్ కొన్నెల్లీ, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా ఉన్నారు. అయితే ఈ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో ఏ టీం గెలిస్తే అది ఫైనల్స్‌కు వెళ్తుంది. ఓడిపోయిన టీమ్‌కు ఇక ఇంటికే

Advertisment
Advertisment
తాజా కథనాలు