కాంగ్రెస్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడంపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో తన పార్టీ వీలినంపై అడ్డంకులు వస్తున్నాయన్న ఆమె.. ఈ నెల 30లోపు కాంగ్రెస్ పార్టీలో విలీనంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ పార్టీ విలీనం కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వైఎస్ఆర్టీపీ పార్టీ సిద్దంగా ఉందన్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వర్ రావు కాంగ్రెస్లో చేరడంతో షర్మిల సీటు సందిగ్ధంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే పార్టీ విలీనంపై ఇంతలా ఎన్నడూ మాట్లాడని షర్మిల ఇప్పుడు మాట్లాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
పూర్తిగా చదవండి..Sharmila : కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనానికి బ్రేక్?.. షర్మిల సంచలన వాఖ్యలు
కాంగ్రెస్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయడంపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో తన పార్టీ వీలినంపై అడ్డంకులు వస్తున్నాయన్న ఆమె.. ఈ నెల 30లోపు కాంగ్రెస్ పార్టీలో విలీనంపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ పార్టీ విలీనం కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని షర్మిల స్పష్టం చేశారు.
Translate this News: