జగన్ ను ఓడించేందుకు షర్మిల?.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుందని అన్నారు ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ గిడుగు రుద్రరాజు. త్వరలో ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రాబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో షర్మిలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు.

New Update
జగన్ ను ఓడించేందుకు షర్మిల?.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

Sharmila Targets To Jagan : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో జరిగే మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షడు గిడుగు రుద్రరాజు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పెను మార్పులు సంభవిస్తాయని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఏపీకి ఇంకా స్పెషల్ స్టేటస్ రాలేదు అని అన్నారు. గతంలో ఏపీకి స్పెషల్ ప్యాకేజి తెస్తామని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం లోకి వచ్చాడు.. కానీ, ప్యాకేజి సంగతి మర్చిపోయారని అన్నారు.

ఏపీని అభివృద్ధి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఇంతవరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదని అన్నారు. ఏపీ రాజకీయాల్లోకి YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల(Sharmila) వస్తే ఆహ్వానిస్తామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు.

త్వరలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తారని ఆయన పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమానికి రాహుల్ గాంధీ.. అమరావతి రాజధాని ఉద్యమానికి ప్రియాంక గాంధీ మద్దతు ప్రకటిస్తారని గిడుగు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు