RBI: దేశంలో అన్ని బ్యాంకులు నిబంధనలు పాటించాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా..ఆర్బీఐ కొరడా ఝలిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో బ్యాంకుల లైసెన్సులు కూడా రద్దు చేసింది. కొన్ని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. మరికొన్ని బ్యాంకులకు కోట్లలో జరిమానా విధించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను బేఖాతర్ చేస్తే ఇలాంటి చర్యలు తప్పవని హెచ్చరించింది. తాజాగా మరోమూడు ప్రముఖ బ్యాంకులపై చర్యలు తీసుకుంది ఆర్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఓషన్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ సంస్థలపై చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా రూ. 3కోట్ల జరిమానా విధించినట్లు సోమవారం ప్రకటించింది ఆర్బిఐ. భారత్ లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ పై కూడా ఆర్బీఐ అత్యధికంగా రూ. 2కోట్ల పెనాల్టీని విధించింది.
పూర్తిగా చదవండి..RBI: మరో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా..జాబితాలో ఎస్బీఐ, కెనరా బ్యాంక్ తోపాటు..!
నిబంధనలు అతిక్రమించిన బ్యాంకులపై ఉక్కుపాదం మోపుతోంది ఆర్బీఐ. తాజాగా నియమాలు, నిబంధనలను ఉల్లింఘించినందుకు మరో మూడు బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝలిపించింది. ఎస్బీఐ, కెనరాబ్యాంకు, సిటీయూనియన్ బ్యాంక్ లపై రూ. 3కోట్ల జరిమానా విధించినట్లు సోమవారం ప్రకటించింది.
Translate this News: